📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

జమ్ము కశ్మీర్ మిస్టరీ మరణాలకు కారణాలు: కేంద్రమంత్రి

Author Icon By Vanipushpa
Updated: January 24, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ము కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలు సంభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నెలన్నర రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణాలకు కారణం ఏంటో తెలుసుకునేందుకు అటు రాష్ట్ర ఆరోగ్యశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కారణాలను కనుక్కోలేకపోయింది. అయితే తాజాగా దీనిపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. రాజౌరీ మిస్టరీ మరణాల వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు. రాజౌరీ జిల్లాలోని బుధాల్ గ్రామంలో గతేడాది డిసెంబర్ నెల 7వ తేదీన ఓ కుటుంబం సహపంక్తి భోజనాలు చేసింది. అయితే తిన్న వెంటనే ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇది జరిగిన మరో 5 రోజులకే రెండో సంఘటన చోటు చేసుకుంది. డిసెంబర్ 12వ తేదీ రోజు మరో కుటుంబం సహపంక్తి భోజనాలు చేయగా.. తొమ్మిది మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు చనిపోగా.. ఆరుగురు చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన జరిగిన మరో నెల రోజులకు అంటే జనవరి 12వ తేదీన మరో కుటుంబంలోనూ ఇలాంటిదే జరిగింది. సహపంక్తి భోజనం చేయగా.. మొత్తం పది మంత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇలా 45 రోజుల వ్యవధిలోనే మొత్తంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నిటినీ గుర్తించిన రాష్ట్ర సర్కారు రంగంలోకి దిగి.. బాధితుల నుంచి నమూనాలను సేకరించి దేశంలోని అనేక ల్యాబ్‌లకు పంపించింది. అలాగే బాధితుల్లో కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించామన్నారు. అయితే ఎవరైనా కావాలనే ఈ మూడు కుటుంబాలు తిన్న ఆహార పదార్థాల్లో విషం కలిపి ఉంటే తామస్సలే ఊరుకోమని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Jammu And Kashmir jitendra singh Mystery Causes of Deaths

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.