📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఇండీ కూటమిపై జమ్మూకశ్మీర్ సీఎం విమర్శలు

Author Icon By Sudheer
Updated: February 8, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొంటున్న వేళ, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో రామాయణం సీరియల్‌కు సంబంధించిన ఓ జిఫ్‌ను షేర్ చేసిన ఆయన “జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి, ఒకరినొకరు అంతం చేసుకోండి” అనే సందేశంతో కాంగ్రెస్-ఆప్ పార్టీల మధ్య ఉన్న విభేదాలను ఉద్దేశించి విమర్శించారు.

ఇండియా కూటమి స్థాపన సమయంలో బీజేపీకి బదిలీగా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఒకటై పనిచేయాలని నిర్ణయించుకున్నా, గ్రౌండ్ లెవల్‌లో ఆ సంగతులు కనిపించకపోవడం విస్మయకరంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు కలిసికట్టుగా పోటీ చేయడం లేదు. ఒకే కూటమిలో ఉన్నా, సీట్ల పంపిణీ విషయంలో మళ్లీ పోటీ స్థాయిలోనే వ్యవహరించాయి. ఇదే కారణంగా ప్రజలు ఆ పార్టీలు పట్ల విశ్వాసం కోల్పోయారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు ఇండీ కూటమిలో ఉన్న విభేదాలను మళ్లీ హైలైట్ చేశాయి. ప్రతిపక్ష కూటమిగా బీజేపీని ఎదుర్కొనాలనుకున్న పార్టీల మధ్య అసలు ఐక్యత లేదని ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే కూడా, కూటమిలో లేని ఏకత్వం వల్లే ఓటమిని మూటగట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇండియా కూటమిలో సమన్వయం లేకుంటే వచ్చే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్-ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడి బీజేపీకి లాభం చేకూరేలా వ్యవహరిస్తే, ప్రధాన ప్రతిపక్ష కూటమిగా ఇండీ నిలదొక్కుకోవడం కష్టమవుతుంది. మొత్తంగా ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీల విబేధాలను మరింత తెరమీదకు తెచ్చాయి.

Delhi Election Results Google news India alliance Jammu and Kashmir chief minister Omar Abdullah

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.