హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన పిస్తా హౌస్, షా గౌస్, మెహ్ఫిల్ హోటల్(Mehfil Hotel) చైన్ల యాజమానుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు(IT Raid) చేపట్టింది. గురువారం తెల్లవారుజామునే అధికారులు 50 ప్రత్యేక టీమ్స్తో నగరంలోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ హోటల్ చైన్లు ప్రతి ఏడాది రూ. వందల కోట్ల టర్నోవర్ నమోదు చేస్తున్నట్లు అంచనా. వ్యాపార లావాదేవీలు, క్యాష్ ఫ్లో, అకౌంటింగ్ రికార్డులు, ఇంటర్నేషనల్ లావాదేవీలపై అధికారులు దృష్టి పెట్టారు.
Read Also: TG Weather: వచ్చే రెండు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం
దేశ, విదేశాల్లో విస్తరించిన బ్రాంచులు
ఈ హోటళ్లకు హైదరాబాద్తో పాటు దేశంలోని పలు మెట్రో నగరాల్లో, అలాగే దుబాయ్, దోహా, జెడ్డా వంటి విదేశీ నగరాల్లో కూడా బ్రాంచులు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి విస్తరణ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు(IT Raid), ఫండ్స్ ట్రాన్స్ఫర్, లాభాల వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బిజినెస్ లావాదేవులపై ఐటీ శాఖ దృష్టి
అధికారులు ప్రధానంగా పరిశీలిస్తున్న అంశాలు:
- క్యాష్ ఆధారిత విక్రయాల నిజమైన లెక్కలు
- అకౌంటింగ్లో ఏవైనా గోప్య లావాదేవులున్నాయా
- విదేశీ అకౌంట్స్ ద్వారా నిధుల మళ్లింపు ఉందా
- ఉద్యోగుల పేరోల్, సరఫరాదారుల చెల్లింపుల్లో అసమానతలు ఉన్నాయా
సోదాలు ఇంకా కొనసాగుతుండడంతో పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: