భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. దేశంలోనే అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 (కమ్యూనికేషన్ శాటిలైట్)ను ఈ రోజు సాయంత్రం 5.26 గంటలకు నింగిలోకి పంపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. సుమారు 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని “బాహుబలి రాకెట్”గా పేరుగాంచిన LVM3-M5 ద్వారా ప్రయోగించనున్నారు. ఇది శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి జరగనుంది. ప్రయోగం ప్రారంభమైన 16.09 నిమిషాల తర్వాత ఉపగ్రహం కక్ష్యలోకి ప్రవేశించనుందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భారత్ అంతరిక్ష సాంకేతిక రంగంలో మరో విశిష్ట ఘట్టాన్ని సృష్టించినట్లవుతుంది.
Latest News: Chrome: గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ యూజర్లకు సర్ట్-ఇన్ హెచ్చరిక
CMS-3 ఉపగ్రహం ప్రధానంగా సైనిక మరియు వ్యూహాత్మక సమాచార వ్యవస్థలను బలోపేతం చేయడానికి రూపొందించబడింది. ఇది పూర్తి స్థాయిలో స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడిన కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఈ శాటిలైట్ ద్వారా రక్షణ దళాలకు సురక్షితమైన కమ్యూనికేషన్ లింకులు, అధునాతన డేటా ట్రాన్స్మిషన్ సదుపాయాలు అందించబడతాయి. అంతేకాకుండా, ఈ ఉపగ్రహం ద్వారా విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, ఉపగ్రహ ఆధారిత నెట్వర్క్ వ్యవస్థలకు కూడా సాయపడనుంది. CMS సిరీస్ ఉపగ్రహాలు ఇప్పటికే భారత సైన్యానికి కీలక సమాచారాన్ని అందిస్తున్న నేపథ్యంలో, CMS-3 వాటిలో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందనుంది.
ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం గత కొద్దిరోజులుగా తీవ్రంగా కృషి చేశారు. రాకెట్ అసెంబ్లీ, ఇంధనం నింపడం, ఫైనల్ సిస్టమ్ చెక్స్ అన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ప్రయోగం ద్వారా భారత అంతరిక్ష పరిశోధనలో కొత్త మైలురాయి చేరుకోనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని దేశీయ సాంకేతికతతో అంతరిక్షంలోకి పంపడం భారత ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం అని చెబుతున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే, ఇస్రో భవిష్యత్ లో మరింత భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను, అంతరిక్ష రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయగల సత్తా ఉందని ఇది నిరూపించనుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/