భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో అద్భుత ఘట్టానికి శ్రీకారం చుట్టింది. అత్యంత భారీ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో ‘బాహుబలి’ గా పేరుగాంచిన LVM3 రాకెట్ నేడు(బుధవారం) ఒక చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ మిషన్ భారత్ తన అంతరిక్ష శక్తిని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పనుంది. (ISRO) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ వేదికగా ఈరోజు ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించిన 24 గంటల కౌంట్డౌన్ ఇప్పటికే ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది.
Read Also: Google: గూగుల్ నుండి కొత్త ఫీచర్
ఈ ప్రయోగంలో 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ఎల్వీఎం-3-ఎం6 రాకెట్ మోసుకెళ్లనుంది. ప్రయోగం జరిగిన 15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తిచేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్మొబైల్ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత భూభాగం నుంచి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: