భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి ‘ఈ-ప్యాంట్రీ’ సేవను ప్రారంభించింది. ఈ-ప్యాంట్రీ సేవ ప్రారంభంతో ప్రయాణికులకు రైళ్లలో ఆహార నాణ్యతపై ఉన్న ఆందోళనలు గణనీయంగా తగ్గనున్నాయని భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ముందస్తు ఆర్డర్ విధానం ద్వారా భోజనం సరైన సమయానికి, శుభ్రత ప్రమాణాలను పాటిస్తూ సరఫరా చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి ముందు లేదా ప్రయాణ సమయంలోనూ ఆహారాన్ని బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..
బర్త్ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం
ఈ సేవ ద్వారా ప్రయాణికులు తమ సీట్లను వదిలి వెళ్లే అవసరం లేకుండానే, తమ బర్త్ దగ్గరకే శుభ్రమైన, వేడి ఆహారం (Food), ప్యాకేజ్డ్ వాటర్ను ముందుగానే బుక్ చేసుకుని పొందవచ్చు. గతంలో ప్రీమియం రైళ్లకు మాత్రమే పరిమితమైన ఈ సేవను ఇప్పుడు 25 మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు విస్తరించారు. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ధృవీకరించబడిన, RAC టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు భోజనాన్ని ఆర్డర్ చేయవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు ఈ-ప్యాంట్రీ సేవను విస్తరించే యోచనలో ఉన్నట్లు భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా మెనూలు, సేవలను మరింత మెరుగుపర్చే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: