భారత ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యాటకులకు వినూత్నంగా వీక్లీ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉన్న పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ముంబై కేంద్రంగా ఈ ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకత ఏంటంటే – టికెట్ నిర్ధారణపై ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ప్రయాణీకుడికీ కన్ఫర్మ్ టికెట్ లభిస్తుంది. పైగా, వీక్లీ టూర్ కావడం వలన ప్రయాణికులకు తాము కోరుకున్న తేదీల్లోనే యాత్రను ప్రణాళిక చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.
అన్నీ వసతులు కలిగిన ప్రయాణం
IRCTC వెస్ట్ జోన్ (ముంబై) ఈ టూర్ ప్యాకేజీలను నిర్వహిస్తోంది. ముంబై నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీలలో వైష్ణోదేవి, తిరుపతి, సిమ్లా, ద్వారక, షిర్డీ, ఇండోర్, ఉజ్జయినీ, సోమనాథ్, హైదరాబాద్, కొల్హాపూర్, ఖజురాహో, ఓంకారేశ్వర్ వంటి పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. టూర్లో భాగంగా టికెట్లతో పాటు హోటల్ వసతి, భోజనం, AC సదుపాయాలు, ప్రయాణ బీమా తదితర సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఒక్కొక్కరికి ప్రారంభ ధర రూ.8,599గా నిర్ణయించారు. ఆన్లైన్లో లేదా ముంబై IRCTC కార్యాలయంలో 5 రోజుల ముందే బుకింగ్ చేసుకోవచ్చు.
పర్యాటక ప్రియులకు ఆధ్యాత్మిక, చారిత్రక అనుభూతి
ఈ వీక్లీ ప్యాకేజీలలో ఆధ్యాత్మిక ప్రదేశాలైన వైష్ణోదేవి, తిరుపతి, మహాకాళేశ్వర్, షిర్డీ, సోమనాథ్, ద్వారకాధీష్, ఓంకారేశ్వర్, మహాలక్ష్మి ఆలయం వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. చారిత్రక ప్రదేశాల్లో కుఫ్రి, మాల్ రోడ్ (సిమ్లా), అజంతా-ఎల్లోరా గుహలు, ఖజురహో దేవాలయాలు, రాజ్వాడ ప్యాలెస్, జై విలాస్ ప్యాలెస్ వంటి ప్రాంతాలు టూర్లో భాగమవుతాయి. ఒకేసారి ఆధ్యాత్మికత, చారిత్రక దృష్టికోణంలో ప్రయాణాన్ని అనుభవించాలనుకునే వారికి ఈ ప్యాకేజీలు శ్రేష్టమైన ఎంపికగా నిలుస్తాయి. IRCTC ఈ ప్రయత్నం ద్వారా మళ్లీ రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కీలక అడుగు వేసింది.
Read Also : CM Revanth : చర్చకు రమ్మంటే రేవంత్ ఢిల్లీకి పారిపోయాడు – కేటీఆర్