Iran Israel War: పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత వాణిజ్య నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
Read Also: War : భద్రతకు గ్యారంటీ లేదు.. తరలింపు సాధ్యం కాదు – చేతులెత్తేసిన అమెరికా ఎంబసీ!
నిలిచిపోయిన 37 భారత జెండా నౌకలు
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, భారత జెండాతో ప్రయాణిస్తున్న సుమారు 37 నౌకలు పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ పరిసర ప్రాంతాల్లో నిలిచిపోయాయి. ఈ నౌకల్లో మొత్తం 1,109 మంది నావికులు ఉన్నట్లు గుర్తించారు. హోర్ముజ్ జలసంధి మూసివేతతో ఈ నౌకలు అటు ఇరాన్ వైపు గానీ, ఇటు అంతర్జాతీయ జలాల్లోకి గానీ రాలేక అక్కడే చిక్కుకుపోయాయి.
ముడి చమురు సరఫరాపై ప్రభావం
ఈ నౌకల్లో అధిక శాతం భారత ఓడరేవులకు ముడి చమురు (Crude Oil), ఎల్ఎన్జీ (LNG) తీసుకువస్తున్నవే ఉన్నాయి. మరికొన్ని నౌకలు గల్ఫ్ దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను లోడ్ చేసుకోవడానికి వెళ్తుండగా మధ్యలోనే ఆగిపోయాయి. ఈ దిగ్బంధం మరికొన్ని రోజులు కొనసాగితే భారత్లో ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగంలోకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు భారత ప్రభుత్వ అధికారులు తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (DGS) నిరంతరం ఆయా షిప్పింగ్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది. నావికుల భద్రతకు పెద్దపీట వేస్తూ, వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అక్కడి పరిణామాలను ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: