📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

జమిలి ఎన్నికలఫై రామ్నాథ్ కోవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: December 12, 2024 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు సంభవిస్తాయని, GDP 1%-1.5% వృద్ధి చెందుతుందని జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు చేసిన అధ్యయనాల ప్రకారం జమిలి ఎన్నికల వల్ల తక్షణ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని ఆయన తెలిపారు. జమిలి ఎన్నికల విధానం దేశ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉన్నదని, ఈ విధానం ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాలను ప్రతిబింబించేది కాదని, ప్రజల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా ఉంటుందని కోవింద్ పేర్కొన్నారు. అందుకే జమిలి ఎన్నికల ఆలోచనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

జమిలి ఎన్నికలు చట్టరూపం దాల్చితే, దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని, ప్రభుత్వ యంత్రాంగంపై ఉన్న ఒత్తిడిని తగ్గించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జమిలి ఎన్నికల అనంతరం 100 రోజుల్లోనే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధానం అమల్లోకి వస్తుందని కోవింద్ వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ఒక సమన్వయ పద్ధతిలో ఉంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలపై కేంద్రం తీసుకునే నిర్ణయం రాజకీయ పార్టీలు, ప్రజల మధ్య చర్చకు దారితీయనుంది. దీని వల్ల దేశ రాజకీయ వ్యవస్థలో సుదీర్ఘ కాలానికీ ప్రభావం చూపే మార్పులు సంభవించే అవకాశం ఉంది.

Jamili Elections Ramnath Kovind

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.