📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Telugu News: Indigo: రూ.58 కోట్ల జరిమానా తో ఇండిగోకు కోలుకొని దెబ్బ

Author Icon By Sushmitha
Updated: December 12, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలోని ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కొద్ది రోజులుగా వందల కొద్దీ విమానాలను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సంస్థపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

Read Also: Indian Citizenship: భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు

జీఎస్టీ జరిమానా విధింపు

ఇదే సమయంలో ఇండిగో కంపెనీకి రూ.58.75 కోట్ల జీఎస్టీ జరిమానా విధిస్తూ పన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌కు చెందిన సీజీఎస్టీ అదనపు కమిషనర్ కార్యాలయం నుంచి నిన్న ఈ ఆర్డర్ అందినట్లు సంస్థ తెలిపింది.

IndiGo suffers blow after being hit with Rs 58 crore fine

డీజీసీఏ కఠిన చర్యలు

మరోవైపు ఇండిగోలో నెలకొన్న గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇండిగో భద్రత మరియు కార్యాచరణ ప్రమాణాలను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్లను వారి విధుల నుంచి తొలగించింది.

ప్రత్యేక పర్యవేక్షణ బృందాల ఏర్పాటు

పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకు రెండు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను గురుగ్రామ్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు డీజీసీఏకు వివరణాత్మక నివేదిక సమర్పిస్తాయి.

పర్యవేక్షణ కార్యక్రమం

మొదటి బృందం విమానాల సంఖ్య, పైలట్ల లభ్యత, సిబ్బంది పనిగంటలు, శిక్షణ షెడ్యూళ్లు వంటి కార్యాచరణ అంశాలను పరిశీలిస్తుండగా, రెండవ బృందం ప్రయాణికులపై ప్రభావం, రిఫండ్‌ల స్థితి, సామాను తిరిగి ఇవ్వడం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Air travel Aircraft Operations Airlines Aviation Crisis aviation safety Budget Airlines civil aviation DGCA flight cancellations Flight Inspectors Google News in Telugu GST Penalty Gurugram Indian Aviation Indigo InterGlobe Aviation Latest News in Telugu Passenger Troubles Pilot Shortage Regulatory Action Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.