భారతదేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) పీటర్ ఎల్బర్స్ (Peter Elbers) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. వెంటనే పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన ఆయన, తన నోటీస్ కాలాన్ని రద్దు చేయాలని కోరుతూ సమర్పించిన రాజీనామా లేఖ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ వంటి ప్రధాన విమానయాన సంస్థలు వరుసగా వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. కొత్త ప్రభుత్వ నిబంధనలు, ఇరాన్ ద్వారా పెరుగుతున్న ముడి చమురు ధరలు ఈ రంగం లాభదాయకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Read Also: Switzerland Bus Fire Accident: ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
అధికారికంగా ప్రకటన విడుదల
ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండిగోను నిర్వహిస్తున్న మాతృ సంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (InterGlobe Aviation Ltd) నేడు సాయంత్రం స్టాక్ ఎక్స్ఛేంజ్కు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. పీటర్ ఎల్బర్స్ రాజీనామాను ధృవీకరిస్తూ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా CEO బాధ్యతలను స్వీకరించి, అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది. తన రాజీనామా లేఖలో ఎల్బర్స్ వ్యక్తిగత కారణాలను పేర్కొన్నారు. నోటీసు కాలాన్ని మినహాయింపునివ్వాలని కోరడం పలువురి దృష్టిని ఆకర్షించింది. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి, ఇండిగో షేర్లు 3.46 శాతం వృద్ధితో ₹4383 వద్ద ముగిశాయి. అయితే, 2026 ప్రారంభం నుండి చూస్తే ఈ స్టాక్ విలువ ఇప్పటికే 14.23 శాతం క్షీణించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :