అడవిలో ప్రకృతి ప్రేమికులకు ఓ సూపర్ న్యూస్ వచ్చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా Jungle Safari Train ప్రారంభమైంది. ఈ ప్రయాణం ప్రకృతిని దగ్గరగా అనుభవించాలనుకునే వారికి అద్భుతం.ఇటీవల ఉత్తరప్రదేశ్లో విస్టాడోమ్ కోచ్తో కూడిన ప్రత్యేక రైలు ప్రారంభించారు. ఈ రైలు కతర్నియా ఘాట్ నుంచి దుధ్వా టైగర్ రిజర్వ్ వరకు పరుగెడుతుంది. పర్యాటకులకు ఇది వారాంతాల్లో అందుబాటులో ఉంటుంది.
అడవిలో రైలు ప్రయాణం – పూర్తిగా కొత్త అనుభూతి
ఈ ప్రత్యేక రైలు విస్టాడోమ్ కోచ్తో కూడి ఉంటుంది. పెద్ద కిటికీలు, పారదర్శక పైకప్పు దీనికి ప్రత్యేకత. రైలులో కూర్చుంటూ పచ్చని అడవి అందాలు చూసే అవకాశం ఉంది.ఈ కోచ్లను ఇండియన్ రైల్వే టూరిజం కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. పర్యాటకులకు ఇది రైలు ద్వారా జంగిల్ సఫారీ అనుభవాన్ని అందిస్తుంది.
అడవిలో జీవవైవిధ్యాన్ని కళ్లారా చూడొచ్చు
రైలు మొత్తం 107 కిలోమీటర్ల పొడవైన అడవిలో పరుగెడుతుంది. దారి మొత్తం ప్రకృతి దృశ్యాలు, జంతువులు కనిపించే అవకాశం ఉంటుంది.ఈ ప్రయాణం సుమారు 4 గంటల 25 నిమిషాలపాటు సాగుతుంది. టికెట్ ధర కేవలం ₹275 మాత్రమే. ఇది ప్రతి ప్రకృతి ప్రియుడికి చవకైన, వినూత్నమైన అనుభవం.
బిచియా టూ మైలానీ స్పెషల్ రైలు డీటైల్స్
ఈ రైలుకు బిచియా టూ మైలానీ టూరిస్ట్ స్పెషల్ (52259) అనే పేరు ఉంది. ఇది ఉదయం 11:45 గంటలకు బిచియా నుంచి బయలుదేరుతుంది. సాయంత్రం 4:10 గంటలకు మైలానీకి చేరుతుంది.రెవర్స్ ప్రయాణం ఉదయం 6:05 గంటలకు మైలానీ నుంచి ప్రారంభమై, 10:30 గంటలకు బిచియాకు చేరుతుంది.
ఈ రైలు మొత్తం 9 స్టేషన్లను దాటి వెళుతుంది:
బిచియా, మంజ్రాపుర్వా, ఖైరతియా డ్యామ్ రోడ్, టికునియా, బెల్రాయన్, దుధ్వా, పలియాకలాన్, భిరా ఖేరి, మైలానీ.ఈ రైలు ప్రకృతి ప్రేమికులకు పండగలా ఉంటుంది. దట్టమైన అడవులు, సహజ వాతావరణం మధ్య ప్రయాణం ఒక గుర్తుండిపోయే అనుభవం. రైలు మార్గం మొత్తం జంతువుల ఆవిర్భావంతో అద్భుతంగా మారుతుంది.వీళ్ల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన విస్టాడోమ్ కోచ్ ఈ ప్రయాణానికి ప్రత్యేకతనిస్తుంది. దీన్ని త్వరలో వారంలో అన్ని రోజులకు విస్తరించనున్నారు.
Read Also : JK LG Manoj Sinha : భారత సైన్యం దాటి వెళ్లలేని ప్రదేశం పాకిస్థాన్లో లేదు : మనోజ్ సిన్హా