ఇండియాకు మిస్ యూనివర్స్ లు, మిస్ వర్ల్డ్ లు బాగానే వచ్చాయి. ప్రపంచ అందగత్తెలతో మనవారు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. అయితే మిస్ అందగత్తెల పోటీలానే మిసెస్ పోటీలు కూడా జరుగుతాయి. 48 ఏళ్ళుగా వీటిని నిర్వహిస్తున్నారు. పెళ్ళైన, తల్లులు అయిన మహిళలకు ఈ పోటీ నిర్వహిస్తారు. ఇందులో మొదట్టమొదటిసారిగా ఒక భారతీయులు టైటిల్ గెలుచుకున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో భారతీయురాలు షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. 48 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీలో ఈ మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా షెర్రీ సింగ్(Sherry Singh) చరిత్ర సృష్టించారు. ఈసారి పోటీల్లో మొత్తం 120మంది దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
Read Also: Lajawal Ishq: పాకిస్థాన్లో రియాలిటీ షో పై దేశ ప్రజల ఆగ్రహం
మహిళలకూ అంకితం చేసిన షెర్రీసింగ్
మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న షెర్రీసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. మిసెస్ యూనివర్స్ 2025గా ఆమె పేరు ప్రకటించినప్పుడు కన్నీళ్ళను ఆపుకోలేకపోయారు. ఈమెకు తొమ్మిదేళ్ళ క్రితం పెళ్ళయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. షెర్రీ సింగ్ తన విజయాన్ని అందరు మహిళలకూ అంకితమిచ్చారు. పరిస్థితులు దాటుకుని, కలలు కనడానికి సాహసం చేసే ప్రతీ మహిళకు ఈ విజయం అంకితమని ఆమె చెప్పారు.
తెలివితేటలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం
మనీలాలో జరిగిన మిసెస్ యూనివర్శ్ పటీల్లో విజేతను కేవలం అందం ద్వారానే కాకుండా..తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలకు కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్ళుగా పేద బాలికల విద్యకు మద్దతునిచ్చే సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. అదే సమయంలో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తూన్నారు. వీటిని కూడా జ్యూరీ పరిగణనలోకి తీసుకుంది. షెర్రీ సింగ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా మాస్టర్స్ డిగ్రీ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: