దేశ భద్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తాజాగా ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఓ కీలక అరెస్టు చేశారు. రాజస్థాన్కు చెందిన కాసింను, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరఫున గూఢచర్యం చేస్తూ పట్టుకున్నారు.భరత్పూర్ జిల్లాలోని డీగ్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక పోలీస్ విభాగం గురువారం అతడిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కాసిం పోలీసు రిమాండ్లో ఉన్నాడు.పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. కాసిం రెండు సార్లు పాక్ వెళ్లాడు. ఒకసారి 2024 ఆగస్టులో, మరోసారి 2025 మార్చిలో. ఈ రెండు సందర్భాల్లో మొత్తం 90 రోజులు అక్కడే ఉన్నాడు.అక్కడ ఉన్న సమయంలో అతను ఐఎస్ఐ అధికారుల వద్ద శిక్షణ పొందాడు. ఇది సాధారణ పర్యటన కాదని, స్పష్టమైన ఉద్దేశంతో వెళ్లాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత సిమ్లు పాకిస్తాన్కు పంపుతున్నాడు
కాసిం చేస్తున్న పనులు చాలా ప్రమాదకరంగా తేలాయి. అతను భారత సిమ్ కార్డులను (Indian SIM Cards) పాకిస్తాన్కు పంపిస్తున్నాడని అధికారులు తెలిపారు. ఆ సిమ్లతో పాక్ నిఘా అధికారులు భారతీయుల్ని వాట్సాప్లో సంప్రదిస్తున్నారు.ఈ మార్గంలో వారు సైనిక, ప్రభుత్వ సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. ఇది నేరుగా జాతీయ భద్రతపై దాడి లాంటిదే అని అధికారులు అంటున్నారు.
తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నెట్వర్క్
ఇక్కడితో కాసిం చర్యలు ఆగలేదు. అతను భారత్లో అనేక మందిని తీవ్రవాద వైపు మళ్లించాడని అనుమానాలు ఉన్నాయి. ఇతనికి పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు.ఇతని ద్వారా ఇంకా ఎందరో వ్యక్తులు దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో చూస్తున్నారు.
కాసిం సోదరుడు ఐఎస్ఐ ఏజెంట్!
కాసిం మాత్రమే కాదు, అతని సోదరుడు కూడా ఐఎస్ఐ ఏజెంట్ అని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడిపై విచారణ కొనసాగుతోంది.ఈ నేపధ్యంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ నెట్వర్క్ను పూర్తిగా బయటకు తీయడమే ఇప్పుడు లక్ష్యం.
దేశ భద్రతకు గట్టి హెచ్చరిక
ఇప్పటికే 2024 సెప్టెంబర్లో అధికారాలు హెచ్చరించాయి. పాక్ ఇంటెలిజెన్స్ భారతీయ నంబర్లు దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ హెచ్చరిక నిజమవుతోంది.కాసిం అరెస్ట్ ఈ నేపథ్యంలో కలకలం రేపుతోంది. దేశ భద్రతకు ఇది పెద్ద ముప్పు. అందుకే ఈ ఆపరేషన్కు నిఘా సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
Read Also : Mamata Banerjee : ప్రధాని మోదీకి సవాల్ విసిరిన మమతా!