📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Indian Sailors: ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 3:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Indian Sailors: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్ పై ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ముగ్గురు భారత నావికులు చనిపోయినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఒమన్ తీరంలోని రెండు నౌకలపై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

Read Also: Iran Proxy War: పశ్చిమాసియాను వణికిస్తున్న ప్రైవేట్ ఆర్మీ!

Indian Sailors: Three Indians killed in Iran attacks

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానం ప్రమాదకరంగా మారింది. ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్, మరో నౌకపై డ్రోన్ లేదా పేలుడు పదార్థాలతో కూడిన మానవరహిత నౌకలతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇంజిన్ రూమ్‌లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సిబ్బంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఒకరిని భారతీయుడిగా ఒమన్ అధికారులు, భారత ఎంబసీ ఇప్పటికే ధ్రువీకరించగా, మొత్తం మృతుల సంఖ్య ముగ్గురికి చేరినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తాజా ప్రకటనలో పేర్కొన్నారు.

ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన భారతీయ నావికుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అలాగే దాడులకు గురైన నౌకల్లోని మిగిలిన భారతీయ సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Indian Embassy in Oman Indian sailors killed in West Asia war Iran attacks on US Israel Oman coast ship attacks

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.