📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఆపేసిన ఇండియన్ రైల్వే

Author Icon By sumalatha chinthakayala
Updated: January 29, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది వస్తుండటంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా స్పెషల్‌ ట్రైన్లను ఇండియన్‌ రైల్వే నిలిపివేసింది. తర్వాతి ఆదేశాలు వచ్చేంత వరకు ఆపేస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్‌ ట్రైన్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది. మౌని అమావాస్య రోజున ప్రయాగ్‌రాజ్‌లో రద్దీ దృష్ట్యా, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మహాకుంభమేళా ప్రత్యేక రైళ్ల ఆపరేషన్‌ను నిలిపివేశారు.

దీంతో జంక్షన్‌లో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తుల రద్దీ నెలకొంది. వివిధ మార్గాల్లో నడిచే మిగిలిన కుంభమేళా ప్రత్యేక రైళ్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుండి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే కుంభమేళా ప్రత్యేక రైళ్లు మాత్రమే నిలిచిపోయాయి. కానీ సాధారణ రైళ్లు నడుస్తున్నాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రత్యేక రైలును నిలిపివేస్తున్నట్లు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు.

మరోవైపు ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌లో తొక్కిసలాట జరగడంతో, ఇండియన్ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), పోలీసు బలగాల మోహరింపు పెంచారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మౌని అమావాస్య స్నానానికి వచ్చే భక్తులను సురక్షితంగా సంగమానికి చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాకుంభంలో ఇప్పటి వరకు 13 కోట్ల మందికి పైగా భక్తులు స్నానాలు చేశారు. మౌని అమావాస్య పర్వదినాన దాదాపు 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానానికి తరలివచ్చారు.

Crowd of devotees Google news Indian Railways Maha Kumbh Mela Special Trains

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.