📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Latest News: Indian Railways: రైలు ప్రయాణంలో లగేజీ మోతాదుపై కొత్త ఫ్రేమ్‌వర్క్

Author Icon By Radha
Updated: December 17, 2025 • 9:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే(Indian Railways) కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో అనుమతించిన పరిమితికి మించి లగేజీ తీసుకెళ్లే ప్రయాణికులపై అదనపు ఛార్జీలు విధించేందుకు సిద్ధమైంది. రద్దీ, భద్రత మరియు ఇతర ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే లగేజీ పరిమితులు ఉన్నప్పటికీ, వాటిని చాలామంది పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించారు.

Read also: Harish Rao: స్పీకర్ నిర్ణయంతో రాజ్యాంగంపై చెలరేగిన రాజకీయ దుమారం

కోచ్‌ల వారీగా లగేజీ పరిమితులు

కొత్త నిబంధనల ప్రకారం, స్లీపర్ క్లాస్ మరియు ఏసీ 3-టైర్‌లో ప్రయాణించే వారు గరిష్ఠంగా 40 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 2వ ఏసీ క్లాస్ ప్రయాణికులకు ఈ పరిమితిని 50 కిలోలుగా నిర్ణయించారు. ఇక 1వ క్లాస్‌లో ప్రయాణించే వారికి 70 కిలోల వరకు లగేజీ అనుమతిస్తారు. జనరల్ బోగీలో ప్రయాణించే వారు గరిష్ఠంగా 35 కిలోల వరకే సరుకులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిమితులను మించి లగేజీ ఉంటే, రైల్వే నిబంధనల ప్రకారం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.

పిల్లలు, కుటుంబ ప్రయాణికులకు ప్రత్యేక వెసులుబాటు

Indian Railways: 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల విషయంలో రైల్వే కొంత వెసులుబాటు కల్పించింది. పెద్దలకు అనుమతించిన లగేజీ పరిమితిలో 50 శాతం వరకు లేదా గరిష్ఠంగా 50 కిలోల వరకు పిల్లల లగేజీకి అనుమతి ఉంటుంది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు. అయితే ఈ పరిమితులను మించినప్పుడు మాత్రం ఛార్జీలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణానికి ముందు లగేజీ బరువును పరిశీలించుకోవాలని, అవసరమైతే పార్సెల్ సేవలను వినియోగించుకోవాలని రైల్వే సూచిస్తోంది.

రైళ్లలో ఎంత వరకు లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు?
కోచ్‌ను బట్టి 35Kg నుంచి 70Kgల వరకు అనుమతి ఉంటుంది.

పరిమితి మిస్తే ఏం జరుగుతుంది?
అదనపు లగేజీపై ఛార్జీలు వసూలు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Excess Baggage Charges Indian Railways latest news Passenger Luggage Railway Guidelines Train Luggage Rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.