📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Indian Railways:హైదరాబాద్, సికింద్రాబాద్ సహా పలు చోట్లో రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై

Author Icon By Pooja
Updated: August 12, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ రైల్వే(Indian Railways), కేంద్ర ప్రభుత్వం యొక్క ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో, దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఈ నెల 8న రాజ్యసభలో ధృవీకరించారు.

రైల్‌వైర్ పేరుతో ఫ్రీ వైఫై

రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఇప్పటికే చాలా రైల్వే(Indian Railways) స్టేషన్లలో టెలికాం సంస్థల 4జీ/5జీ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా ఈ ఉచిత వైఫై సేవలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలను రైల్‌టెల్ సంస్థ ‘రైల్‌వైర్’ పేరుతో అందిస్తోంది.

Indian Railways:హైదరాబాద్, సికింద్రాబాద్ సహా పలు చోట్లో రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై

ప్రధాన స్టేషన్లు

ప్రధాన స్టేషన్లైన సికింద్రాబాద్,(Secunderabad) హైదరాబాద్, కాచిగూడలతో పాటు న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, బెంగళూరు (యశ్వంత్‌పుర్), అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్‌సర్, ఎర్నాకుళం, ప్రయాగ్‌రాజ్ వంటి పలు నగరాల్లోని స్టేషన్లలో కూడా ఈ సౌకర్యం ఉంది.

ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ‘రైల్‌వైర్'(railwire) నెట్‌వర్క్‌ను ఎంచుకుని, తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేయడం ద్వారా ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఈ సదుపాయం ద్వారా ప్రయాణికులు స్టేషన్లలో ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆధారిత పనులను సులభంగా చేసుకోవచ్చు.

భారతీయ రైల్వే ఎన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందిస్తోంది?

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను అందిస్తోంది.

ఈ సేవలు ఏ ప్రధాన స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి

సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడతో పాటు న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, బెంగళూరు (యశ్వంత్‌పుర్), అహ్మదాబాద్, భోపాల్, పుణె, భువనేశ్వర్, అమృత్‌సర్, ఎర్నాకుళం, ప్రయాగ్‌రాజ్ వంటి అనేక ప్రధాన స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ప్రయాణికులు ఉచిత వైఫైని ఎలా ఉపయోగించుకోవచ్చు?

ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్లలో ‘రైల్‌వైర్’ నెట్‌వర్క్‌ను ఎంచుకుని, తమ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఫోన్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేయడం ద్వారా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు.

Read Hindi news: hindi.vaartha.com

Read also:

Ashwini Vaishnaw Breaking News Free WiFi Google news Indian Railways Indian Railways news indian railways news today latest news Railway Station RailWire Secunderabad Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.