Indian Pilot : మా కస్టడీలో భారత పైలట్ ఎవరూ లేరు – పాక్

Read Time:  1 min
1730040200390 army
1730040200390 army
FONT SIZE
GET APP

భారత వాయుసేనకు చెందిన ఒక పైలట్ పాకిస్థాన్ సైన్యం అదుపులో ఉన్న ప్రచారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే ఈ ప్రచారంపై పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. తమ కస్టడీలో భారత పైలట్ ఎవరూ లేరని స్పష్టంగా తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేస్తున్నారని అన్నారు.

తప్పుడు ప్రచారం

అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపిన ప్రకారం, పాక్ సైన్యం పూర్తిగా సంయమనంతో వ్యవహరిస్తోందని, తప్పుడు వార్తలు సృష్టించి ప్రాంతీయ భద్రతను ప్రభావితం చేయాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గంభీరంగా తీసుకుంటోందని, బాధ్యతగా స్పందిస్తోందని చెప్పారు.

గహంలోనూ ఇలాగే తప్పుడు ప్రచారం

ఇదిలా ఉండగా గతంలో వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ సైన్యం 2019లో అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేసిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటన తర్వాత ఇలాంటి వార్తలు వస్తే ప్రజల్లో కలకలం రేకెత్తడం సహజం. అయితే తాజా పరిణామాల్లో ఆవిధమైనదేమీ జరగలేదని పాక్ ప్రకటించడం ఈ ప్రచారానికి సమాధానంగా నిలిచింది.

Read Also : India – Pakistan War : భారత్ పై ప్రతీకారం తీర్చుకున్నాం -పాక్ ISPR DG

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.