हिन्दी | Epaper

Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు

Divya Vani M
Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు

Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.తాజాగా ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్లను సవరించేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పెంపు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నెల జీతం రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరిగింది. అలాగే, రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు.మాజీ ఎంపీల పింఛన్ కూడా పెరిగి, రూ.25,000 నుండి రూ.31,000కు చేరుకుంది.ఐదేళ్ల సర్వీసు తర్వాత అదనంగా లభించే పింఛన్ రూ.2,000 నుండి రూ.2,500కి పెంచారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనే ఈ పెంపు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Indian Parliament ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు
Indian Parliament ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు

2018లో చివరిసారిగా ఎంపీల వేతనాల్లో మార్పులు చేశారు. ఆ సమయంలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని, ఎంపీల మూల వేతనం రూ.1 లక్షగా నిర్ణయించారు. అప్పటి నుంచి ఎంపీలకు కార్యాలయ నిర్వహణ, ఓటర్లతో సంబంధాలు కొనసాగించేందుకు నియోజకవర్గ భత్యంగా రూ.70,000, కార్యాలయ నిర్వహణ ఖర్చుల కోసం రూ.60,000, రోజువారీ భత్యంగా రూ.2,000 లభించేవి.తాజా సవరణ ప్రకారం, వీటిని కూడా పెంచనున్నారు. ఎంపీలకు ఫోన్, ఇంటర్నెట్ వినియోగానికి ప్రత్యేక భత్యం లభిస్తుంది.వార్షికంగా 34 ఉచిత దేశీయ విమాన ప్రయాణాలు, ఎప్పుడైనా ఫస్ట్ క్లాస్ రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే మైలేజ్ అలవెన్స్ పొందే వీలుంటుంది.

అంతేకాకుండా సంవత్సరానికి 50,000 యూనిట్ల ఉచిత విద్యుత్, 4,000 కిలోలీటర్ల ఉచిత నీరు అందజేస్తారు. ఎంపీల ఐదేళ్ల పదవీకాలంలో ఢిల్లీలో అద్దె లేని నివాస సౌకర్యం లభిస్తుంది.సీనియారిటీ ఆధారంగా హాస్టల్ గదులు, అపార్ట్‌మెంట్లు లేదా బంగ్లాలు కేటాయిస్తారు. అయితే అధికారిక వసతిని ఉపయోగించకూడదనుకునే ఎంపీలు, నెలవారీ గృహ అద్దె భత్యం పొందే అర్హత కలిగి ఉంటారు. నూతన వేతనాలు భత్యాల పెంపుతో ఎంపీల జీవిత విధానం మరింత లాభదాయకంగా మారనుంది.అయితే ప్రజలకు సేవ చేయడంలో ఈ పెంపు ఎంతవరకు ప్రభావం చూపిస్తుందనేది గమనించాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870