ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి వస్తున్న ముప్పులకు గట్టి బదులు ఇవ్వాలని భారత్ పకడ్బందీగా సిద్ధమవుతోంది.ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించే అధికారం ఆర్మీ చీఫ్కి అప్పగించింది.ఈ నిర్ణయం ‘ఆపరేషన్ సింధూర్’ కింద తీసుకున్నదని విశ్వసనీయ సమాచారం.పాక్ తరచూ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడుతోంది. వాటిని భారత్ విజయవంతంగా తిప్పికొట్టినప్పటికీ, పాక్ కుట్రలు ఆగడం లేదు.దీంతో మరింత అప్రమత్తమైన కేంద్రం, సరిహద్దుల్లో భద్రతను బలోపేతం చేస్తోంది.ఇది ఒక రిజర్వ్ సైనిక దళం.సాధారణ పరిస్థితుల్లో వీరు తమ ఉద్యోగాల్లో కొనసాగుతారు. కానీ దేశానికి అవసరమైతే, రెగ్యులర్ ఆర్మీకి తోడుగా పనిచేస్తారు.వీరికి కూడా కఠినమైన శిక్షణ ఉంటుంది. దేశ భద్రత కోసం నిరంతరం సిద్ధంగా ఉంటారు.
1948లో టెరిటోరియల్ ఆర్మీ చట్టం ఆమోదమైంది. 1949లో దీనికిది అధికారికంగా ప్రారంభమైంది.ప్రస్తుతం సుమారు 50,000 మంది ఈ దళంలో సేవలందిస్తున్నారు.గతంలో 1962, 1965, 1971 యుద్ధాల్లో వీరు రాణించారు. ప్రకృతి విపత్తుల్లోనూ సహాయం చేశారు.ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం, ఆర్మీ చీఫ్ అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి పిలిచే అధికారం కలిగి ఉంటారు.రెగ్యులర్ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ సభ్యులు పనిచేస్తారు. ఇది సమయానికి సైనిక బలం అందించడంలో ఎంతో ఉపయోగకరంగా మారుతుంది.
ఈ దళంలో పలువురు ప్రముఖులు గౌరవ హోదాలతో చేరారు. ఎం.ఎస్. ధోనీ, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్ వంటి వారు లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఉన్నారు. సేవలతోపాటు వారికి పింఛన్, వైద్య సదుపాయాలు, క్యాంటీన్ లాంటి ప్రయోజనాలు లభిస్తాయి.కేరళ వరదల సమయంలో నటుడు మోహన్లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్గా సేవలందించడం గమనార్హం. ఇదే ఉదాహరణగా నిలుస్తోంది.భారత్ భద్రత విషయంలో ఎలాంటి రాజీకి పోదని ఈ నిర్ణయం చెబుతోంది. టెరిటోరియల్ ఆర్మీ ద్వారా దేశ రక్షణకు అదనపు బలం లభిస్తుంది. పాక్ కుట్రలకు ఇది గట్టి సమాధానం అవుతుంది. దేశం కోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశం ఉన్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం కూడా!
Read Also : ATM: యుద్ధం వేళ ఏటీఎం లు పనిచేయవా?ఎస్బీఐ వివరణ