దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓటరు ఎలా స్పందిస్తాడన్న దానిపై జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే (india today) ఎప్పటిలాగే సీ-ఓటర్ తో కలిసి మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. వీటి ఫలితాలను తాజాగా విడుదల చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే జాతీయ స్దాయిలో ఎన్టీయే కూటమికి 350కి పైగా స్ధానాలు వస్తాయని అంచనా వేసింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు పెండింగ్ లో ఉన్న తమిళనాడులో ఓటరు నాడిని కూడా వెల్లడించింది.
Read Also: SC: దివ్యాంగుల టాయిలెట్ల పై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాల ప్రకారం..
తమిళనాడులో ఇండియా టుడే – సి ఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాల ప్రకారం స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమి మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుందని తేల్చేసింది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తమిళనాడులోని మొత్తం 39 స్థానాల్లో ఇండియా కూటమి ఏకంగా 38 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమికి అసలు పోటీయే లేదని తేల్చింది. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడులో ఓటరు నాడి అధికార పక్షంవైపే ఉందని ఇండియాటుడే సర్వేలో తేలింది. అలాగే ఈ ఎన్నికలతో అరంగేట్రం చేస్తున్న హీరో విజయ్ పార్టీ టీవీకే ఒంటరిపోరుతో నష్టపోవడం ఖాయమని కూడా తేలిపోతోంది. ఇప్పటికే విజయ్ పార్టీ టీవీకే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని పదే పదే చెప్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే కూటమికి వ్యతిరేకంగా విజయ్ కు ఓటేసేందుకు జనం సిద్దంగా లేరని సర్వే తేల్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: