📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Telugu News: India-అమెరికా టారిఫ్‌లను తట్టుకొని దూసుకెళ్తున్న భారత

Author Icon By Sushmitha
Updated: September 17, 2025 • 4:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా(America) విధించిన దిగుమతి సుంకాల ప్రభావం భారత(India) ఆర్థిక వ్యవస్థపై పెద్దగా పడలేదని బ్యాంక్ ఆఫ్ బరోడా తన నివేదికలో వెల్లడించింది. దేశీయంగా ఉన్న బలమైన ఆర్థిక మూలాలు, పటిష్టమైన వినియోగం, జీఎస్టీ 2.0 సంస్కరణలే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడినప్పటికీ, దేశీయ ఇన్వెస్టర్లు పెట్టిన పెట్టుబడులు మార్కెట్లకు రక్షణగా నిలిచాయని నివేదిక విశ్లేషించింది.

దేశీయ ఆర్థిక బలం, జీఎస్టీ సంస్కరణలు

బ్యాంక్ ఆఫ్ బరోడా బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, జీఎస్టీలో(GST) చేపట్టిన సంస్కరణలు, ఆర్బీఐ ముందుగానే వడ్డీ రేట్లను తగ్గించడం వంటి చర్యలు భారత ఈక్విటీ మార్కెట్ వృద్ధికి దోహదపడ్డాయి. ఈ కారణాల వల్లే విదేశీ ఒడిదొడుకుల నుంచి మన మార్కెట్లు నిలదొక్కుకోగలిగాయని నివేదిక స్పష్టం చేసింది. అమెరికా టారిఫ్‌లు(tariff) విధించినప్పటికీ, 2025లో సెన్సెక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 66.5 బిలియన్ డాలర్ల మేర పెరగడం గమనార్హం.

ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో అమెరికా మార్కెట్లు డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 6.1 ట్రిలియన్ డాలర్ల(trillion dollars) మార్కెట్ విలువను కోల్పోయాయి. కానీ, అదే సమయంలో భారత్, హాంగ్‌కాంగ్, బ్రెజిల్, చైనా వంటి దేశాలు సానుకూల రాబడులను నమోదు చేశాయి.

దేశీయ ఇన్వెస్టర్లదే కీలక పాత్ర

జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ(Strategy) క్రిస్టోఫర్ వుడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని బలపరిచారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారీగా అమ్మకాలు జరిపినప్పటికీ, దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుంచి వస్తున్న పెట్టుబడుల ప్రవాహం వల్లే ఈ ఏడాది భారత మార్కెట్లు నిలబడ్డాయని ఆయన అన్నారు. గత 25 నెలలుగా దేశీయ ఇన్వెస్టర్ల నుంచి నికరంగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లోనే వారు ఈక్విటీలలో 37.6 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు.

అమెరికా టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై ఎందుకు పడలేదు?

దేశీయంగా ఉన్న బలమైన ఆర్థిక మూలాలు, జీఎస్టీ సంస్కరణలు, దేశీయ ఇన్వెస్టర్ల పెట్టుబడులు దీనికి ప్రధాన కారణం.

అమెరికా టారిఫ్‌ల వల్ల ఆ దేశ మార్కెట్లకు ఎంత నష్టం జరిగింది?

అమెరికా మార్కెట్లు 6.1 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/protesters-garland-potholes-road-rage-india/national/549047/

Bank of Baroda domestic investors Google News in Telugu GST reforms. Indian Economy Latest News in Telugu stock market Telugu News Today US Tariffs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.