📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: India: మతం మార్చుకుని, పాక్ వ్యక్తిని పెళ్లాడిన భారతీయ సిక్కు మహిళ

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆమె వెళ్లింది దేవుడిని దర్శించుకునేందుకు. అందుకోసం దేశం కానీ దేశానికి వెళ్లింది. తన మత విశ్వాసాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఇంతలో ఏమైందో ఏమో తెలియదు, మరో మతంలోని వ్యక్తిని పెళ్లాండేందుకు ఆ మతాన్నే స్వీకరించిన ఉదంతం ఇది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ వేడుకల నిమిత్తం పాకిస్తాన్కు వెళ్లిన భారతీయ సిక్కు యాత్రికుల బృందం నుంచి అదృశ్యమైన ఓ మహిళ ఇస్లాం మతాన్ని స్వీకరించి, స్థానిక వ్యక్తిని వివాహం చేసుకుంది. పంజాబ్ లోని కపుర్తలాకు చెందిన ఈ మహిళ చర్యతో భారత భద్రతా, విదేశాంగ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

పంజాబ్ లోని(Punjab) కపుర్తలాకు చెందిన సర్వజిత్ కౌర్ (52) అనే ఓ మహిళ గురునానక్ దేవ్ 555వ జయంతి సందర్భంగా నవంబరు 4న 1,992 మంది యాత్రికులతో కూడిన బృందంలో ఆమె వాఘా-అట్టారీ సరిహద్దు గుండా పాకిస్తాన్ లోకి ప్రవేశించింది. పదిరోజుల పాటు చారిత్రక గురుద్వారాలను సందర్శించిన యాత్రికుల బృందం నవంబరు 13న భారత్ కు (India) తిరిగి వచ్చింది. అయితే, ఈ బృందంలో సర్వజిత్ కౌర్ లేరు. భారత్ లోకి ప్రవేశించిన ఇమ్మిగ్రేషన్ రికార్డుల్లో ఆమె పేరు లేకపోవడంతో ఆమె పాక్ లోనే మిస్ అయింది. 

 Read Also: Vijayanagaram:కాకి తీసిన దీపంతో అగ్నిప్రమాదం:నాలుగు ఇళ్లు బూడిద

India

ఇండియాకు పంపే ఏర్పాటు: పాక్ మంత్రి 

సర్వజిత్ కౌర్ అదృశ్యమైన కొద్ది రోజులకే ఉర్దూ భాషలో ఉన్న ఒక నిఖా నామా (ఇస్లామిక్ వివాహ ఒప్పంద పత్రం) వెలుగులోకి వచ్చింది. ఆ పత్రం ప్రకారం, ఆమె ఇస్లాం మతాన్ని స్వీకరించింది. మత మార్పిడి తర్వాత ఆమె తన పేరును నూర్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. షేక్ పూరాకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని నూర్ సర్వజిత్ కౌర్ వివాహం చేసుకున్నట్లు ఆ పత్రంలో ఉంది. సర్వజిత్ కౌర్ కు గతంలోనే విడాకులయ్యాయి. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా, వారు గత 30 ఏళ్లుగా మాజీ భర్త కర్నైల్ సింగ్ తో కలిసి ఇంగ్లండ్ లో నివసిస్తున్నారు. పాకిస్తాన్ మంత్రి అరోరా ఈ విషయంపై స్పందిస్తూ, సర్వజిత్ కౌర్ ను అరెస్టు చేసి, ఆమెను తిరిగి భారత్ కు పంపేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Indian Sikh woman interfaith marriage International Relations Latest News in Telugu Pakistan marriage religious conversion Sikh diaspora. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.