📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

India : పాక్ కు చైనా ఇచ్చిన రెండు విమానాలను కూల్చివేసిన భారత్!

Author Icon By Divya Vani M
Updated: May 8, 2025 • 10:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాక్ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.పాకిస్థాన్, భారత నగరాలపై మిస్సైల్ దాడులకు తెగబడ్డది. అయితే, భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది.సరిహద్దు దాటి వచ్చే మిస్సైళ్లను వెంటనే గుర్తించి నిర్వీర్యం చేసింది.ఇక భారత్ ప్రతిదాడిలో పాక్‌కు గట్టి బుద్ధి చెప్పింది.ముఖ్యంగా, చైనా నుంచి పాక్‌కి అందిన రెండు JF-17 యుద్ధ విమానాలను భారత బలగాలు కూల్చివేశాయి.ఈ దాడుల్లో పైలట్లు చనిపోయారా? లేక పారిపోయారా? అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.ఈ నష్టం విషయాన్ని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్వయంగా ధృవీకరించారు.

India పాక్ కు చైనా ఇచ్చిన రెండు విమానాలను కూల్చివేసిన భారత్!

మేం విధి నిర్వహణలో ఉండగా రెండు JF-17 విమానాలు కోల్పోయాం,” అని ఆయన ప్రకటనలో చెప్పారు.ఇది అంతే కాదు.పాక్ క్షిపణి దాడులు జమ్మూ, అమృత్‌సర్, కతువా లాంటి ప్రాంతాలపై జరిపినట్టు సమాచారం. అయితే వీటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఎస్-400 ‘సుదర్శన్ చక్ర’ సమర్థంగా అడ్డుకుంది. దాదాపు 80 శాతం మిస్సైళ్లను వెంటనే నిర్వీర్యం చేసింది.భారత వైమానిక దళం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పీవోకేలోని ఉగ్రస్థావరాలపై లక్ష్యంగా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ముజఫరాబాద్, సియాల్‌కోట్ వంటి ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి.

పాకిస్థాన్ వైపున 31 మందికిపైగా మృతిచెందినట్టు సమాచారం. మరోవైపు, పాక్ దాడుల వల్ల భారత దేశంలో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.జమ్మూ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. శుక్రవారం రాత్రి పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అఖ్నూర్, సాంబా వంటి ప్రాంతాల్లో సైరన్లు మోగించబడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్‌అవుట్ ప్రకటించారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పలు ప్రాంతాల్లో యుద్ధ విమానాలను తక్షణమే మోహరించింది. ఎస్-400 వాయుసేన వ్యవస్థలు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలకు అవసరమైన మార్గదర్శకాలు అధికారులు అందిస్తున్నారు.ఇక ఈ ఉద్రిక్తత నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఇరుదేశాలకు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి.

Read Also : Pakistan : జమ్మూ కశ్మీర్‌ పై పాక్ క్షిపణి, డ్రోన్ల దాడి

India Pakistan conflict Indian Air Force Strike Indo-Pak Border Tensions Jammu Kashmir News JF-17 Fighter Jet Crash Operation Sindoor Pakistan Missile Attack S-400 Air Defense System

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.