हिन्दी | Epaper
బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

India Fuel Stations: పెట్రోల్ బంకుల పెరుగుదలతో ప్రయాణికులకు ఊరట

Rajitha
India Fuel Stations: పెట్రోల్ బంకుల పెరుగుదలతో ప్రయాణికులకు ఊరట

దేశంలో వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన అవసరాలను తీర్చేందుకు చమురు కంపెనీలు విస్తృతంగా పెట్రోల్ బంకుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య లక్ష దాటింది. గత పదేళ్లలో ఈ సంఖ్య దాదాపు రెట్టింపు కావడం విశేషం. ఈ భారీ విస్తరణతో అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే అత్యధిక పెట్రోల్ బంకులు కలిగిన మూడో దేశంగా భారత్ నిలిచింది. ఇది దేశ మౌలిక వసతుల బలాన్ని సూచించే కీలక సంకేతంగా భావిస్తున్నారు.

Read also: North Korea: మరిన్ని క్షిపణులు తయారీకి కిమ్ నిర్ణయం

India Fuel Stations

India Fuel Stations

గ్రామీణ ప్రాంతాలకు ఇంధన సౌకర్యం: ప్రయాణికులకు ఊరట

పెట్రోల్ బంకుల విస్తరణలో గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుతం మొత్తం బంకులలో దాదాపు 29 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పదేళ్ల క్రితం ఇది 22 శాతం మాత్రమే. ఒకప్పుడు పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్య చాలా వరకు తగ్గింది. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మారుమూల గ్రామాలకు కూడా ఇంధనాన్ని చేరవేస్తుండటంతో ప్రయాణికులకు సౌకర్యం పెరిగింది, సేవల నాణ్యత కూడా మెరుగైంది.

పెట్రోల్ బంకులు కాదు… భవిష్యత్తు మల్టీ-ఫ్యూయల్ హబ్‌లు

మారుతున్న కాలానికి అనుగుణంగా పెట్రోల్ బంకులు కూడా రూపాంతరం చెందుతున్నాయి. ఇప్పుడు కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా CNG, ఎలక్ట్రిక్ వాహనాల కోసం (EV) ఛార్జింగ్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు మూడో వంతు బంకుల్లో ఈ ప్రత్యామ్నాయ ఇంధన సేవలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవి మల్టీ-ఫ్యూయల్ హబ్‌లుగా మారితే బంక్ యజమానులకు లాభాలు పెరగడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870