భారత రక్షణ రంగం ఇప్పుడు అసలు ఊపులో ఉంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో దేశం ముందుకు దూసుకెళ్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25లో దేశ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు రూ.23,622 కోట్లను తాకాయి. ఇది దాదాపు $2.76 బిలియన్లకు సమానం. భారత రక్షణ రంగ చరిత్రoలో ఇదొక చారిత్రక ఘట్టం.గత ఏడాది రూ.21,083 కోట్లుగా ఉన్న ఎగుమతులు ఈసారి 12.04% పెరిగాయి. మరి 2013-14లో ఏమాత్రం ఉందో తెలుసా? కేవలం రూ.686 కోట్లు! అంటే ఈ పదేళ్లలో 34 రెట్లు వృద్ధి సాధించాం. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ విజయాన్ని స్పష్టంగా చాటుతోంది.India ప్రస్తుతం భారత్ రక్షణ ఉత్పత్తులు సుమారు 80 దేశాలకు పంపుతోంది. ఇది ఒక్కదేశం కష్టపడి సాధించగలిగే విజయం కాదు. దీనికి ప్రభుత్వ మద్దతు, ప్రైవేట్ రంగ పట్టుదల, మరియు టెక్నాలజీ అభివృద్ధి ప్రధాన కారణాలు. 2029 నాటికి ఈ ఎగుమతులు రూ.50,000 కోట్ల వరకు పెంచాలని రక్షణ మంత్రిత్వ శాఖ గట్టిగా నిర్ణయించింది.
‘ఆపరేషన్ సిందూర్’ – భారత ఆయుధాల నాణ్యతకు సాక్ష్యం
ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ భారత ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది. భారత ఆయుధ వ్యవస్థలు ఎంత ఆధునికంగా తయారవుతున్నాయో ఈ ఆపరేషన్ స్పష్టంగా తెలియజేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది భారత్కి మరింత గ్లోబల్ మార్కెట్లో పేరు తెచ్చిపెడుతుంది.ఈ ఏడాది ఎగుమతుల్లో ప్రైవేట్ రంగం ముందంజలో ఉంది. వారు రూ.15,233 కోట్ల విలువైన ఉత్పత్తులను ప్రపంచానికి అందించారు. ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUs) కూడా వెనుకపడలేదు – రూ.8,389 కోట్ల ఉత్పత్తులు ఎగుమతి చేశాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, DPSUల ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 42.85% పెరిగాయి.
నూతన విధానాలు, ప్రోత్సాహకాలు – విజయానికి చుక్కెదురు
భారత ప్రభుత్వం అనేక సదుపాయాలను తీసుకువచ్చింది. వీటిలో ఆన్లైన్ అనుమతి ప్రక్రియలు, విధాన సవరణలు, స్వదేశీ తయారీకి మద్దతు వంటి చర్యలు ఉన్నాయి. ఇవి దేశీయ తయారీదారులకు కొత్త అవకాశం కల్పిస్తున్నాయి.ఇప్పుడు భారత్ తక్కువ దిగుమతులు చేసుకుంటోంది. India కానీ ఎగుమతుల్లో మాత్రం దూసుకెళ్తోంది. మందుగుండు సామగ్రి, ఆయుధాలు, విడిభాగాలు, యుద్ధ సామగ్రి వంటి ఎన్నో రకాల ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచానికి వెళ్లిపోతున్నాయి.ఈ వేగవంతమైన ప్రగతి చూస్తే మన దేశం త్వరలోనే గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో కీలక భూమిక పోషించనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : Yogi Adityanath : భారత్ భద్రతకు భంగం కల్గిస్తే అంత్యక్రియలకు కూడా పనికిరారు :యోగి ఆదిత్యనాథ్