📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Indian tax department update : సోషల్ మీడియా అకౌంట్లపై ఐటీ నజర్ నిజం ఏంటి?

Author Icon By Sai Kiran
Updated: December 23, 2025 • 1:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Indian tax department update : వచ్చే ఏడాది ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖ ప్రజల సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్ తదితర డిజిటల్ వేదికలపై నిఘా పెడుతుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్త పూర్తిగా తప్పుదోవ పట్టించేదని Press Information Bureau (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చిచెప్పింది.

కొత్త ఆదాయపు పన్ను చట్టం–2025 పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలు సాధారణ పన్ను చెల్లింపుదారులకు వర్తించవని, కేవలం భారీ పన్ను ఎగవేతలకు సంబంధించిన అధికారిక సోదాలు, సర్వే ఆపరేషన్ల సమయంలో మాత్రమే పరిమితంగా వర్తిస్తాయని స్పష్టం చేసింది.

America: ఆలస్యమవుతున్న వీసా అపాయింట్ మెంట్ తో టెన్షన్..టెన్షన్

ఎవరికే ఈ అధికారం వర్తిస్తుంది?

ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం, ఒక వ్యక్తి లేదా (Indian tax department update) సంస్థ భారీగా పన్ను ఎగవేసిందన్న బలమైన ఆధారాలు ఉన్నప్పుడు, అధికారికంగా సోదాలు జరుగుతున్న సందర్భాల్లో మాత్రమే ఐటీ అధికారులకు డిజిటల్ రికార్డులను పరిశీలించే అధికారం ఉంటుంది. అంతేకానీ, రొటీన్ అసెస్‌మెంట్లు, సాధారణ స్క్రూటినీ కేసులు లేదా నిజాయితీగా పన్నులు చెల్లించే వారి సోషల్ మీడియా ఖాతాలు, ఈమెయిల్స్, క్లౌడ్ స్టోరేజీని చూసే అధికారం **Income Tax Department**కు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇప్పటికే అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం–1961లోని సెక్షన్ 132 ప్రకారం భౌతిక సోదాల సమయంలో పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకునే అధికారం ఉంది. ఇప్పుడు డిజిటల్ యుగానికి అనుగుణంగా, ఆ నిబంధనలను ఆధునికీకరిస్తూ డిజిటల్ రికార్డుల స్వాధీనాన్ని మాత్రమే చట్టంలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు, క్రిప్టో ఆస్తులు, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు వంటి వర్చువల్ డిజిటల్ స్పేస్‌లను సోదాల్లో భాగంగా పరిశీలించవచ్చని చెప్పారు.

ప్రభుత్వ హామీ

కొత్త నిబంధనలతో అధికారాల దుర్వినియోగం జరుగుతుందనే ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. “బలమైన కారణాలు ఉన్నాయని నమ్మినప్పుడే” సోదాలు చేపట్టేలా కఠినమైన నిబంధనలు ఉన్నాయని హామీ ఇచ్చింది. నిజాయితీగా ఆదాయాన్ని ప్రకటించి, సకాలంలో పన్నులు చెల్లించే పౌరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐటీ శాఖ పునరుద్ఘాటించింది. పన్ను సంస్కరణలపై తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Digital privacy India tax law Google News in Telugu Income tax act 2025 fact check Income tax digital records access Income tax social media monitoring Indian tax department update IT department clarification news IT Department social media access Latest News in Telugu PIB fact check IT department PIB fake news clarification Social media access tax raids Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.