📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆదాయ పన్ను బిల్లు :నిర్మలసీతారామన్

Author Icon By Ramya
Updated: February 10, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో ఆర్ధిక మందగమన పరిస్ధితుల నేపథ్యంలో తాజాగా పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్దిక మంత్రి వేతన జీవులకు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా 12 లక్షలకు పెంచడం ద్వారా మధ్యతరగతికి భారీ ఊరటనిచ్చారు. అలాగే కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్ లను మార్చారు. అదే సమయంలో కొత్తగా ఆదాయపు పన్ను బిల్లు తీసుకొస్తామని ప్రకటన చేశారు. అన్నట్లుగానే ఇవాళ కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ కొత్త ఆదాయపు పన్ను బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సిద్దమవుతున్నారు. చివరి నిమిషంలో మార్పు ఉంటే తప్ప ఇవాళ లోక్ సభలో ఈ బిల్లు తీసుకురావడం ఖాయమైంది. అయితే ఇందులో ఏముందనే చర్చ వేతన జీవుల్లో మొదలైంది. దేశంలో ప్రత్యక్ష పన్ను చట్టాలను సరళీకృతం చేయడం ఈ బిల్లు లక్ష్యం. అయితే ఇందులో ఎలాంటి కొత్త పన్ను భారాలు ఉండకపోవచ్చని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. అయితే చట్టాన్ని పన్ను చెల్లింపుదారులకు మరింత చేరువ చేసేందుకు పలు మార్పులు తీసుకురానుంది.

మరోవైపు తాజాగా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో పాటు అమెరికా నుంచి భారీగా వలసదారుల్ని స్వదేశానికి బేడీలు వేసి మరీ పంపేస్తుండటంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశాలున్నాయి. అలాగే శ్రీలంక నేవీ భారతీయ మత్స్యకారులను అరెస్టు చేయడంపైనా విపక్షాలు కేంద్రాన్ని ఇరుకునపెట్టబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి సిద్దమవుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలి భాగం జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత మార్చి 10న తిరిగి సమావేశమై ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుంది.

ముఖ్యమైన మినహాయింపులు:
వివిధ ఆదాయ వర్గాలకు కొన్ని మినహాయింపులు మరియు సౌకర్యాలను అందించే విధంగా మార్పులు చేసినట్లు చెప్పవచ్చు.

లావాదేవీ పన్ను:
ఈ బిల్లులో లావాదేవీ పన్నును విధించడంలో కొన్ని సంస్కరణలు అమలు చేయబడతాయి, తద్వారా వాణిజ్య రంగం మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా అభివృద్ధి చెందుతుంది.

లావాదేవీ పన్ను:
ఈ బిల్లులో లావాదేవీ పన్నును విధించడంలో కొన్ని సంస్కరణలు అమలు చేయబడతాయి, తద్వారా వాణిజ్య రంగం మరింత సమర్థవంతంగా మరియు పారదర్శకంగా అభివృద్ధి చెందుతుంది.

#DigitalTaxation #IncomeTaxBill2025 #IndiaBudget #TaxReform #TaxUpdates Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.