Ram Gopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV), అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణంపై ఆయన స్పందించారు. అయితే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా తనదైన శైలిలో విశ్లేషించి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. ఈ యుద్ధాన్ని ఆయన “జీసస్, అల్లా మధ్య జరుగుతున్న పోరాటం”, ఇందులో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారిపోతా” అంటూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Read Also: RC17 Update: సుకుమార్-చరణ్ సినిమాలో కృతి సనన్?
కొందరు ఆయన వ్యాఖ్యను తీవ్రంగా విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం తన స్టైల్లోనే స్పందించారని అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు. మరోవైపు ఇరాన్ ముస్లిం దేశం. ఈ నేపథ్యంలో ఈ యుద్ధాన్ని మతపరమైన కోణంలో వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ వర్మ ట్వీట్ చేశారని నెటిజన్లు భావిస్తున్నారు.
భయానక పరిస్థితులు
ఈ యుద్ధ ప్రభావం పశ్చిమాసియాలోని అనేక దేశాలపై పడుతోంది. దుబాయ్, అబుదాబి, ఒమన్, ఖతార్ వంటి ప్రాంతాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయాలు మూతపడటంతో అనేక మంది విదేశీయులు అక్కడే చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ పౌరులను అమెరికా తరలించే ప్రయత్నాలు ప్రారంభించగా, ఐరోపా దేశాలు కూడా తమ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుండగా, అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: