📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Drug Seizure : గుజరాత్ తీరంలో రూ.1800 కోట్ల విలువైన భారీగా డ్రగ్స్ సీజ్

Author Icon By sumalatha chinthakayala
Updated: April 14, 2025 • 2:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Drug Seizure : గాంధీనగర్ గుజరాత్ తీరంలో 300 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ. 1800 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఏప్రిల్ 12, 13 తేదీలలో రాత్రులలో గుజరాత్ ATS తో కలిసి భారత తీర రక్షక దళం (ICG) చేసిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ICG నౌకను గుర్తించగానే నిందితులు contraband ను విసిరి, అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దును దాటి పారిపోయారు.

అనుమానాస్పద కార్యకలాపాలు

ఇటీవల ఏప్రిల్ 10న బంగాళాఖాతంలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడంతో చేపల వేటకు వెళ్లిన ఓ పడవను భారత తీర రక్షక దళం అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) లో ICG నౌక వరాద్ పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పద కదలికలు ఉన్నట్లు గుర్తించారు. చేపల వేటకు వినియోగించే ఓడలో ఏదో లోడింగ్ జరిగిందని, అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని అప్రమత్తం అయ్యారు.

ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు

అధికారులు తక్షణం రంగంలోకి దిగి ఆ ఓడలో 50 నుండి 60 కిలోగ్రాముల బరువున్న దాదాపు 450 సంచులు తరలిస్తున్నట్లు భారత కోస్ట్ గార్డ్స్ కనుగొన్నారు. మార్కెట్ విలువ దాదాపు రూ. 1 కోటిగా ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని Kakdwip ఫిషింగ్ హార్బర్ పేరిట ఆ బోడ్ రిజిస్టర్ అయి ఉంది. కానీ చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా పడవ నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. పడవలో ఉన్న 14 మంది భారతీయులలో ఎవరి వద్ద గుర్తింపు కార్డులు లేవు.

సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు

తాము ఐదు రోజులుగా సముద్రంలో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. కానీ పడవలో చేపలు పట్టేందుకు వినియోగించే పరికరాలు గానీ, చేపలు కూడా కనిపించలేదు. దాంతో ఆ బోటు ద్వారా డ్రగ్స్ లాంటివి అక్రమంగా సముద్రం ద్వారా విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. భారత తీర రక్షక దళం ఆ పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పడవను సీజ్ చేసి చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు చేపట్టార. విచారణ కోసం పారదీప్ పోర్టుకు తరలించినట్లు సమాచారం. సముద్ర జలాలకు సంబంధించిన చట్టాల ఆధారంగా చర్యలు చేపట్టారు.

  Read Also: మరోసారి సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు.. కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం..!
 

Breaking News in Telugu Google news Google News in Telugu Gujarat coast Huge drug seizure Latest News in Telugu Paper Telugu News Rs. 1800 crore Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.