అంతరిక్షంలో మనుషులు ఎలా జీవిస్తారు? తింటారు? నిద్రపోతారు? ఇలాంటి అనేక ప్రశ్నలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (Space Station) (ISS) నుంచి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhamshu Shukla) స్వయంగా సమాధానం ఇచ్చారు. గురువారం భారత్లోని విద్యార్థులతో ఆయన ఆన్లైన్లో ముచ్చటించారు.ఇక్కడ భూమిలా నేల, పైకప్పు ఉండవు. ఎటు పడితే అటే తేలిపోతాం. అందుకే నిద్రపోవాలంటే శరీరాన్ని స్లీపింగ్ బ్యాగ్తో ఒక చోట కట్టుకుంటాం, అని శుక్లా వివరించారు. అంతరిక్ష నిద్ర చాలా వింతగా ఉంటుందన్నారు.
భోజనం ప్రీ-ప్యాక్ – రుచికరంగానే ఉంటుంది
మేము తినే ఆహారం ముందే ప్యాక్ చేసి ఉంటుంది. ప్రతి వ్యోమగామికి అవసరమైన పోషకాలు ఉండేలా ఆహారం ఎంచుకునే అవకాశం ఉంటుంది, అని శుక్లా చెప్పారు. తినే విధానం కాస్త భిన్నంగా ఉంటుందనీ, కానీ రుచి తగ్గదని పేర్కొన్నారు.
విషాదం రావాలంటే టైం లేదు – కుటుంబమే బలం
మానసిక ఆరోగ్యాన్ని ఎలా నిలబెడతారు? అనే ప్రశ్నకు, ఇప్పటి టెక్నాలజీతో కుటుంబంతో వీడియో కాల్స్ చేయొచ్చు. ఆ సంభాషనలు మనల్ని ఉత్సాహంగా ఉంచుతాయి అని అన్నారు. మానసికంగా బలంగా ఉండేలా ఇక్కడ ప్రత్యేక శిక్షణనూ ఇస్తారు.సూక్ష్మ గురుత్వాకర్షణ వల్ల జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదించుతుంది. భూమికి తిరిగాక మళ్లీ శరీరం అలవాటు పడేలా శిక్షణ తీసుకోవాలి,అని ఆయన చెప్పారు.
బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్పై శ్రమ – శాస్త్రీయ ప్రయోగాల్లో భారత ప్రతిభ
శుక్లా ప్రస్తుతం బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్పై పనిచేస్తున్నారు. అమెరికా, హంగేరీ, పోలాండ్ దేశాల నుంచి వచ్చిన మిగతా ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆయన 14 రోజుల మిషన్లో ఉన్నారు. మొత్తం 60 శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్నారు. ఇస్రో నుంచి ఏడు కీలక పరిశోధనలూ ఈ మిషన్లో భాగమయ్యాయి.
Read Also : Sri Lanka Cricket : శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో పాము కలకలం…