📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Floods: హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం

Author Icon By Sharanya
Updated: July 29, 2025 • 3:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిమాచల్ ప్రదేశ్ లో గతకొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం అతలాకుతలమయ్యింది. లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. రోడ్లన్ని జలమయమైపోయాయి. మంగళవారం తెల్లవారుజామున నుంచి మండి జిల్లాలో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు వదలమైపోయాయి. వర్షాలకు వాహనాలు నీటిలో మునిగిపోయిన దృశ్యాలను స్థానికులు వీడియోలు తీసి, సోషల్ మీడియా లో పోస్టు చేసారు. దీంతో ఆ వీడియోలు వైరల్గా మారాయి.

వరదల కారణంగా ముగ్గురు మృతి

కాగా మండి (Mandi) లో ఉదయం నుంచి కురుస్తున్న కుంభవృష్టికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వరదల (Floods) కారణంగా ముగ్గురు మరణించారు. అంతేకాక భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఇక్కడి అధికారులు చెప్పారు. మండిజిల్లా కేంద్రంలోని జైల్రోడ్, జోనల్ హాస్పిటల్ రోడ్, సైంజ్ రీజియన్ తదితర ప్రాంతాల్లో వరదల (Floods) ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత పాంతాల్లో ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్, మండి డిప్యూటీ కమిషనర్ తదితరులు పర్యటిస్తూ, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న రెస్క్యూటీం

కాగా మండి తదితర ప్రాంతాలోని గ్రామాల ప్రజలు వరదలో (Villagers in flood) చిక్కునిపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో, శిథిలాల తొలగింపటులో రెస్క్యూ సిబ్బంది 24 గంటలూ నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. కాగా, వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో పఠాన్కోట్, మండి జాతీయ రహదారి, కిరాత్పూర్, మనాలి నాలుగు లైన్ల రహదారి, చండీగఢ్-మనాలి హైవేలు మూతపడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also: Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకారం

Breaking News Climate Impact Flood Disaster 2025 Heavy Rains Himachal Himachal pradesh Himachal Pradesh floods latest news Rescue Operations Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.