📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

April 1st : ఏప్రిల్ 1 నుండి మారేవి ఇవే

Author Icon By Sudheer
Updated: March 27, 2025 • 8:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. దీనిలో భాగంగా ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త ట్యాక్స్ రీతిలో రూ.12 లక్షల వరకు ఆదాయమున్నవారికి పన్ను మినహాయింపు లభించనుంది. ఇది మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చే చర్యగా మారనుంది. పాత ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్న వారిపై మాత్రం పాత నిబంధనలు కొనసాగనున్నాయి.

టీడీఎస్, టీసీఎస్ పరిమితుల్లో మార్పులు

ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ (TDS) మరియు ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (TCS) పరిమితుల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా వ్యాపారులు, పెట్టుబడిదారులపై ప్రభావం చూపుతాయి. అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించి కొత్త టీసీఎస్ రేట్లు అమలవుతాయి. అలాగే, కొన్ని విభాగాల్లో టీడీఎస్ మినహాయింపులు, తగ్గింపులు అందుబాటులోకి రానున్నాయి.

April SBI

క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లలో మార్పులు

దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎస్‌బీఐ (SBI), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) తమ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు చేపట్టాయి. కొన్ని ప్రత్యేక లావాదేవీలకు రివార్డుల కలెక్షన్ తగ్గనుంది. ముఖ్యంగా EMI మార్గంలో కొనుగోలు చేసినప్పుడు రివార్డ్ పాయింట్లు మంజూరు కాకపోవచ్చు. క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ బ్యాంక్ నిబంధనలను ముందుగా తెలుసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

యూపీఐ సేవల్లో మార్పులు

ఏప్రిల్ 1 నుంచి యూపీఐ (UPI) సేవల్లో కూడా కొన్ని కీలక మార్పులు జరుగనున్నాయి. ఇన్ఫ్ర్యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నంబర్లకు, లేదా ఇతరులకు కేటాయించిన నంబర్లకు యూపీఐ సేవలు నిలిపివేయనున్నారు. ఇది బ్యాంకింగ్ భద్రతను పెంచే చర్యగా భావించబడుతోంది. దీని వల్ల అకౌంట్ హోల్డర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా లావాదేవీలు చేసే వినియోగదారులు ఈ మార్పులను గమనించి ముందస్తుగా తగిన చర్యలు తీసుకోవడం అవసరం.

April 1st 2025 Banks changes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.