📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో సంభవించిన కుంభవృష్టి.. 34 మంది మృతి

Author Icon By Sudha
Updated: June 2, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలో ప్రవేశించిన తర్వాత, వాటి ప్రభావం ఈశాన్య భారత రాష్ట్రాల్లో తీవ్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అస్సాం,(Assam,) అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, త్రిపురా, మిజోరాం రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు (Heavy rains)కురుస్తున్నాయి.

Northeastern States : ఈశాన్య రాష్ట్రాల్లో సంభవించిన కుంభవృష్టి.. 34 మంది మృతి

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో (Northeastern States) ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా ఎక్కడికక్కడ కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. కొన్ని చోట్ల వరదలు పోటెత్తుతున్నాయి (Flash Floods). వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
స్తంభించిన జనజీవనం
చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. ఈ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా సంభవించిన ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 34 మంది మరణించారు. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఎన్డీఆర్‌ఎప్‌, ఐఏఎఫ్‌ దళాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఫోన్‌లో మాట్లాడిన అమిత్‌ షా
ఇదిలా ఉండగా.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో వరద పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యల విషయంలో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా కల్పించారు. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో జూన్‌ 4 వరకూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Read Also :Sikkim : సిక్కింలో ఘోర ప్రమాదం.. ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి

Breaking News in Telugu Google news Google News in Telugu Heavy Rains kill 34 people Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.