తొందరపాటు చర్య సరికాదు : ఆర్జీ కర్ మృతురాలి తండ్రి

Read Time:  1 min
Hasty action is not right: RG Kar is father of the deceased
Hasty action is not right: RG Kar is father of the deceased
FONT SIZE
GET APP

కోల్‌కతా: వెస్ట్ బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు ఆగస్టు 9 న సెమినార్ హల్ లో జూనియర్ వైద్యురాలు దారుణంగా హత్యగావించబడిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. దీనిపై.. దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. ఘటన ప్రదేశంలో నిందితుడు సంజయ్ రాయ్ ఇయర్ బడ్స్ దొరికాయి. అంతేకాకుండా.. యువతి శరీరంలో పోస్ట్ మార్టం నివేదికలో ఆమెను అత్యాచారం చేసి హతమార్చినట్లు నివేదికలు వచ్చాయి.

image

అయితే ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటన నిందితుడు సంజయ్ రాయ్‌కి మరణశిక్ష విధించాలంటూ బెంగాల్ ప్రభుత్వం ఈరోజు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. సంజయ్ రాయ్‌కి సీల్దా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. ఈ క్రమంలో మమత ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే మమత ప్రభుత్వం తీరును ఆర్జీ కర్ మృతురాలి తండ్రి తప్పుబట్టారు. ఈ వ్యవహారంలో సీఎం మమతా బెనర్జీ తొందరపాటుతో వ్యవహరించవద్దని సూచించారు.

రేపు తీర్పు కాపీ వస్తుందని, దానిని పరిశీలించాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అప్పటి వరకు తొందరపాటు చర్యలు సరికాదన్నారు. ఆమె ఎన్నో మాటలు చెప్పి… సాక్ష్యాలను తారుమారు చేశారన్నారు. తారుమారు చేసిన వారిలో పోలీస్ కమిషనర్, ఇతరుల ప్రమేయం ఉందన్నారు. ఇవన్నీ మమతా బెనర్జీ చూడలేదా? అని ప్రశ్నించారు. అయితే సీబీఐ సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే నిందితుడికి జీవితఖైదు పడినట్లుగా అభిప్రాయపడ్డారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.