📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

యమునా నది నీటిని తాగిన హర్యానా సీఎం

Author Icon By sumalatha chinthakayala
Updated: January 29, 2025 • 8:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చండీగఢ్‌: దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో అమోనియా ఎక్కువగా ఉందని, నీరు విషపూరితం కావడానికి హర్యానా కారణమని ఆప్‌ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం నయాబ్ సైనీ యమునా నదిలోని నీటిని తాగారు. బుధవారం హర్యానా, ఢిల్లీ సరిహద్దులోని పల్లా గ్రామం వద్ద యమునా నది ప్రవాహంలోని నీటిని దోసిళ్లలోకి తీసుకుని తాగారు. ఆ తర్వాత ఆ నీటిని తన తలపై చల్లుకున్నారు.

కాగా, ఎలాంటి అనుమానాలు లేకుండా యమునా నది నీటిని తాను తాగినట్లు హర్యానా సీఎం నయాబ్‌ సైనీ తెలిపారు. ‘ఢిల్లీ సీఎం అతిషి రాలేదు. ఆమె కొత్త అబద్ధాన్ని సృష్టిస్తుండాలి. కానీ అబద్ధాలకు కాళ్ళు లేవు. అందుకే ఆప్-డా అబద్ధాలు పనిచేయడం లేదు’ అని ఎక్స్‌ పోస్ట్‌లో విమర్శించారు.

మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనస్సులలో భయాన్ని సృష్టించడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని హర్యానా సీఎం సయాబ్‌ సైనీ ఆరోపించారు. జల వనరుల అధికారులు సేకరించిన నీటి నమూనాల్లో ఎలాంటి విష ఆనవాళ్లు లేవని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ తన జీవితాంతం అబద్ధాలు చెబుతారని విమర్శించారు. కృతజ్ఞత లేని హర్యానా కుమారుడైన కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు శిక్షిస్తారని, ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ను ఓడిస్తారని అన్నారు.

Arvind Kejriwal CM Nayab Saini haryana poisoning claim Yamuna River

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.