దేశవ్యాప్తంగా జిమ్లు, ఫిట్నెస్ సెంటర్ల ముసుగులో యువతులపై లైంగిక దోపిడీ, బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయన్న తీవ్రమైన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ అంశాన్ని అత్యంత సీరియస్గా పరిగణించిన కమిషన్, సమగ్ర నివేదికలు సమర్పించాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. అలాగే కేంద్ర క్రీడలు-యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కు కూడా ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆరోపణలు నిజమైతే, అది బాధిత యువతుల మానవ హక్కులకు తీవ్రమైన భంగం కలిగించినట్లేనని ఎన్ హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.
Read Also: America: బహుళజాతి సంస్థల ఆర్థిక ఆధిపత్యం!
ఆవేదన
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఓ జిమ్ కేంద్రంగా భారీ దోపిడీ రాకెట్ పనిచేస్తోందని, యువతులే లక్ష్యంగా ఈ దారుణాలు జరుగుతున్నాయని ఓ ఫిర్యాదుదారుడు ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. మీడియా కథనాల ప్రకారం, ఈ ముఠా వలలో దాదాపు 50 మందికి పైగా యువతులు చిక్కుకున్నారని, ఈ రాకెట్లో ఏకంగా ఓ పోలీసు అధికారికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు అధికారి ప్రమేయం ఉండటం అధికార దుర్వినియోగానికి, శాంతిభద్రతల వైఫల్యానికి, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడానికి నిదర్శనమని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మహిళల భద్రతకు, మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని తెలిపారు. ఫిట్నెస్ కేంద్రాల ముసుగులో వ్యవస్థీకృత నేర ముఠాలు పనిచేస్తున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆరోపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: