సూరత్లో ఐదో తరగతి విద్యార్థితో ఉపాధ్యాయురాలు పారిపోగా అరెస్ట్
గుజరాత్లోని సూరత్ నగరంలో జరిగిన విచిత్ర ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పూనాగం ప్రాంతానికి చెందిన ఒక మహిళా ఉపాధ్యాయురాలు – వయసు కేవలం 11 సంవత్సరాల ఐదో తరగతి విద్యార్థితో కలిసి నాలుగు రోజుల క్రితం పారిపోయింది. గురువారం రోజు పోలీసులు ఈ టీచర్ను రాజస్థాన్ రాష్ట్రంలోని షామ్లాజీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థితో కలిసి బస్సులో ప్రయాణిస్తుండగా ఆమెను పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు టెక్నాలజీ సాయంతో, ముఖ్యంగా మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా వారి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థిని అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విచారణలో టీచర్, విద్యార్థి కలిసి వడోదర, అహ్మదాబాద్, జైపుర్, ఢిల్లీ, బృందావన్ వంటి ప్రాంతాల్లో 2,200 కి.మీ మేర ప్రయాణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రయాణ సమయంలో విద్యార్థిపై టీచర్ శారీరక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాక, విచారణలో టీచర్ స్వయంగా కూడా ఈ విషయం అంగీకరించినట్టు సూరత్ సిటీ డీసీపీ భగీరథ్ గర్వి చెప్పారు. ప్రయాణ సమయంలో వీరిద్దరూ రెండు హోటళ్లలో బస చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ఉపాధ్యాయురాలిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే, భారత న్యాయసంహితలోని సెక్షన్ 127 ప్రకారం కూడా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Gujarat : గుజరాత్లో టీచర్ విద్యార్థితో పారిపోవడం – విచారణలో బాహాటం అయిన షాకింగ్ నిజాలు
పోలీసుల ప్రకారం, పారిపోయే ముందు టీచర్ తన మొబైల్ స్విచ్ఛాఫ్ చేయగా, ఆమె రెండో ఫోన్ను ట్రాక్ చేయడం ద్వారా వారి లొకేషన్ తెలుసుకున్నారు. ఈ ఉపాధ్యాయురాలు సూరత్లోని హిందీ మీడియం పాఠశాలలో పనిచేస్తుండగా, విద్యార్థికి మూడు సంవత్సరాల పాటు ప్రైవేట్ ట్యూషన్ కూడా చెప్పింది. ఈ కారణంగా ఇద్దరి మధ్య సంబంధం పెరిగినట్టు తెలుస్తోంది.ఏప్రిల్ 25న విద్యార్థి అకస్మాత్తుగా అదృశ్యమవగా, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థి టీచర్తో చివరిసారిగా మాట్లాడినట్టు గుర్తించారు. అదే రోజు పూనా పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేయగా, తదుపరి దర్యాప్తులో మహిళా ఉపాధ్యాయురాలి ప్రమేయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ మరియు “బుక్ మై ట్రిప్” యాప్ బుకింగ్స్ ఆధారంగా పోలీసులు ఆమె ప్రయాణ వివరాలు గుర్తించారు.ఈ ఘటన విద్యా వ్యవస్థపై అనేక ప్రశ్నలు తెరపైకి తీసుకొస్తోంది. టీచర్, విద్యార్థి మధ్య ఏర్పడిన అనుచిత సంబంధం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
Read More : Trump: పాకిస్తాన్లో నీటి కొరతపై ట్రంప్ ట్రోల్..నిజమేనా?