Parent notification marriage : గుజరాత్ ప్రభుత్వం వివాహ నమోదు ప్రక్రియలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. ఇకపై పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే జంటలు తమ వివాహం గురించి తల్లిదండ్రులకు సమాచారం ఉందని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, దొంగచాటుగా జరిగే వివాహాలపై నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం వధూవరులు దరఖాస్తు సమర్పించిన 10 రోజుల్లోపే రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి వారి తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు SMS, వాట్సాప్ సందేశాలు పంపబడతాయి. పెళ్లి ఆహ్వాన పత్రం, తల్లిదండ్రుల గుర్తింపు వివరాలు వంటి పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది.
Read Also: Cult Teaser Release: ‘కల్ట్’ టీజర్ చూసారా?
ఇప్పటివరకు దరఖాస్తు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేది. కానీ ప్రతిపాదిత మార్పుల ప్రకారం సర్టిఫికేట్ జారీకి కనీసం 30 రోజుల గడువు తప్పనిసరి. ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ఫోటోలు, సాక్షుల వివరాలు ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయబడతాయి. దీని ద్వారా ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తోంది.
తల్లిదండ్రుల భావాలను గౌరవించడం, మోసపూరిత వివాహాలను అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు స్వాగతిస్తుండగా, యువత మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: