గుజరాత్ రాష్ట్రంలోని(Gujarat Crime) సబర్కాంత జిల్లాలో ఒక భయానక ఘటన చోటుచేసుకుంది. గభోయ్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తులోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Montha Cyclone: బంగారం కొట్టుకొని వస్తుంది..ఉప్పాడ ప్రజల నిరీక్షణ

వివరాల ప్రకారం, బాధిత బాలిక మార్కెట్కు(Gujarat Crime) ధాన్యం తీసుకెళ్తుండగా, స్థానికంగా నివసించే ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా సమీపంలోని పొలానికి లాక్కెళ్లాడు. అక్కడ ఇప్పటికే ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమెపై దారుణం సృష్టించారు. వారిలో ఒకడు బాలికను పట్టుకోగా, మిగిలిన ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.
తరువాత బాధితురాలు ఇంటికి చేరి కుటుంబ సభ్యులకు జరిగిన ఘటనను తెలిపింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో ఇద్దరు తమ నేరాన్ని అంగీకరించగా, మరో వ్యక్తి నేరానికి సహకరించానని చెప్పాడు. ప్రస్తుతం ముగ్గురిపైనా పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: