📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Latest News: GST: జీఎస్టీ తగ్గింపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది: కేంద్ర మంత్రి నిర్మలా

Author Icon By Radha
Updated: October 18, 2025 • 10:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ(GST) రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ తగ్గింపుల వల్ల ప్రజలకు నేరుగా లాభం చేకూరుతోందని, తాము తీసుకున్న నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోందని ఆమె అన్నారు. దిల్లీలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “జీఎస్టీ 2.0 సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపును ఇచ్చాయి. ఈ సంస్కరణలతో వినియోగదారులకు ఉపశమనం లభించడంతో పాటు, ఉత్పత్తి రంగాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి” అని పేర్కొన్నారు.

Read also: J&K: జమ్మూకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: అమిత్​ షా

పండుగ సీజన్‌ అమ్మకాలలో భారీ వృద్ధి

నవరాత్రి సీజన్‌లో ఎలక్ట్రానిక్స్‌, ఆటో మొబైల్స్‌ మరియు వినియోగ వస్తువుల విక్రయాలు భారీగా పెరిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రానిక్స్‌ అమ్మకాలు 25% పెరిగాయి. జీఎస్టీ సంస్కరణల ప్రభావంతో ఆహార పదార్థాల ధరలు తగ్గుతున్నాయని, ఇది సాధారణ ప్రజలకు మేలు చేస్తోందని చెప్పారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్‌ డిమాండ్‌ పెరగడం దేశీయ తయారీ పరిశ్రమకు ఊతం ఇస్తోందని వివరించారు.

IMF అంచనాలు పెంపు – ఆర్థిక బలానికి సూచీ

భారత్‌ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతోందని IMF కూడా గుర్తించిందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల IMF భారత్‌ వృద్ధి రేటు అంచనాలను 6.6 శాతంకు పెంచిందని చెప్పారు. ఇది జీఎస్టీ(GST) సంస్కరణలు మరియు పన్ను విధానాల్లో తీసుకున్న సమయోచిత నిర్ణయాల ఫలితమని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యల ప్రకారం, ప్రభుత్వ ఆర్థిక విధానాలు వినియోగం, ఉత్పత్తి, పెట్టుబడులపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

GST GST reforms India economy latest news Nirmala Sitaraman

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.