భారతదేశానికి నూతన ప్రధాన సమాచార కమిషనర్ (Chief Information Commissioner – CIC) గా ప్రభుత్వ మాజీ ఉద్యోగి రాజ్కుమార్ గోయల్ నియమితులయ్యారు. ఈ కీలక పదవికి ఆయన ఎంపికవడం ద్వారా దేశ సమాచార హక్కు (RTI) వ్యవస్థకు ఆయన నాయకత్వం వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ, సమగ్ర పరిశీలన అనంతరం, రాజ్కుమార్ గోయల్ పేరును ఈ అత్యున్నత పదవికి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.
Latest News: Central Funds: PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం
ఈ కమిటీ రాజ్కుమార్ గోయల్ పేరుతో పాటు, మరో ఎనిమిది మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్ల పేర్లను కూడా నియమకం కోసం సిఫార్సు చేసింది. ఈ నియామకాలు సమాచార కమిషన్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, RTI దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో దోహదపడనున్నాయి. రాజ్కుమార్ గోయల్తో సహా నియమితులైన ఇతర కమిషనర్లు, రేపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గోయల్ గారు అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం యూనియన్ టెరిటరీస్ (AGMUT) క్యాడర్కు చెందిన 1990వ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ (రిటైర్డ్) అధికారి. దీర్ఘకాల ప్రభుత్వ సేవలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం, పరిపాలనా సామర్థ్యం, సమాచార హక్కు వ్యవస్థకు మరింత పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఈ నియామకం ద్వారా ఆయన ప్రభుత్వ పాలనలో పౌరుల సమాచార హక్కును మరింత బలోపేతం చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com