Government Rules: భారత ప్రభుత్వం ‘సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026’ పేరుతో సరికొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. పర్యావరణ పరిరక్షణను మరింత బలోపేతం చేయడానికి మరియు రీసైక్లింగ్(Recycling) ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు వ్యర్థాలను మూడు రకాలుగా వేరుచేసే పద్ధతి ఉండగా, ఇకపై ఇళ్లలో చెత్తను నాలుగు వేర్వేరు రకాలుగా విభజించడం తప్పనిసరి.
Read Also: Corruption : భారత్ లో తగ్గిన అవినీతి
కొత్త డబ్బాల కలర్ కోడ్ విధానం
ప్రజలు తమ నివాసాల్లో కింది విధాలుగా డబ్బాలను ఉపయోగించాలి:
- ఆకుపచ్చ (Green): తడి వ్యర్థాల కోసం.
- నీలం (Blue): పొడి వ్యర్థాల కోసం.
- ఎరుపు (Red): ఉపయోగించిన ప్యాడ్లు, డైపర్ల కోసం.
- నలుపు (Black): ఇంట్లో ఉత్పన్నమయ్యే మెడికల్ వ్యర్థాల కోసం.
ఈ కొత్త పద్ధతి వల్ల వ్యర్థాల నిర్వహణ మరింత శాస్త్రీయంగా జరగడమే కాకుండా, రీసైక్లింగ్కు పంపే ప్రక్రియ కూడా వేగవంతమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: