దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్(Hyderabad) మార్కెట్లో 24 క్యారెట్ల(Gold Price) స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,430కు చేరి సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. అదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.1,25,850గా కొనసాగుతోంది. ఇటీవల వరుసగా పెరుగుతున్న ధరలు కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం ధరల పెరుగుదలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read also: Savings Scheme: పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్: FDలకన్నా అధిక రాబడి

వెండి ధరల జోరు, అంతర్జాతీయ ప్రభావం
బంగారంతో(Gold Price) పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర దాదాపు రూ.1,96,948 స్థాయికి చేరింది. ఈ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 4,340 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి ధర 63 డాలర్లకు పైగా ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకుంటున్న నిర్ణయాలు విలువైన లోహాల ధరలపై ప్రభావం చూపుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడం, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు అధికమవడం కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. అంతేకాదు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కూడా పెట్టుబడిదారులను బంగారం, వెండి వైపు మళ్లిస్తున్నాయి. ఈ పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లోనూ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: