📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Golconda Blue Diamond: గోల్కొండ నీలి డైమండ్ తొలి సారి వేలానికి

Author Icon By Sharanya
Updated: April 15, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచంలోని విలువైన వజ్రాలలో ఒకటిగా పేరు పొందిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది స్వాతంత్య్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం. ఇప్పుడది మొట్టమొదటిసారి వేలానికి రానుంది .

గోల్కొండ నీలి వజ్రం

ఈ నీలి వజ్రం మొదట ఇండోర్ మహారాజు యశ్వంత్ రావు హోల్కర్‌ ఆధీనంలోకి వచ్చింది. ఆయన తండ్రి ఈ వజ్రాన్ని 1923లో ఒక ఫ్రెంచ్‌ వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేశారు. వజ్రం అప్పట్లో బ్రేస్‌లెట్‌లో ఉండేది. ఆ తర్వాత దీన్ని ప్రఖ్యాత న్యూయార్క్‌ జువెలర్‌ హ్యారీ విన్‌స్టన్‌ కొన్నారు. అంచెలంచెలుగా ఇది బరోడా రాజవంశానికి చేరింది. కాలక్రమేణా ప్రైవేట్ కలెక్షన్లలోకి వెళ్లిపోయిన ఈ వజ్రం, దశాబ్దాల తర్వాత మళ్లీ వేలంలోకి వస్తుండడం విశేషం.

అంచనాలను దాటి విలువ

ఈ వజ్రం 23-24 క్యారెట్ల బరువు కలిగిన నీలి వర్ణపు వజ్రంగా గుర్తించబడింది. ఇది ఒక బంగారు ఉంగరంలో పొదిగబడిన రూపంలో ఉంది. అత్యంత అరుదైన ఈ రత్నానికి రూ. 300 కోట్ల నుండి రూ. 430 కోట్ల వరకు ధర పలకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జెనీవాలో మే 14న జరగబోయే క్రిస్టీస్‌ ‘మెగ్నిఫిసెంట్‌ జువెల్స్‌’ వేలంలో ఈ వజ్రం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ వేలాన్ని నిర్వహిస్తున్న క్రిస్టీస్‌ సంస్థ అంతర్జాతీయ ఆభరణాల విభాగాధిపతి రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి అరుదైన వజ్రం జీవితంలో ఒక్కసారి మాత్రమే వేలానికి రావచ్చు. గోల్కొండ వజ్రాలను వేలం వేసే అవకాశం 259 ఏళ్ల చరిత్రలో అరుదైన సందర్భం. ప్రస్తుత తెలంగాణలో గోల్కొండ గనులలో లభించిన ఈ నీలి వజ్రం 1920-1930 దశకాలలో ఇండోర్‌ మహరాజుగా ఉన్న యశ్వంత్‌ రావు హోల్కర్‌ వద్దకు చేరింది. 1923లో మహరాజు తండ్రి ఓ ఫ్రెంచ్‌ వ్యాపారి నుంచి బ్రేస్‌లెట్‌లో పొదిగిన ఈ నీలి వజ్రాన్ని కొనుగోలు చేశారు. అనంతరం 1947లో దీన్ని న్యూయార్క్‌ జువెలర్‌ హ్యారీ విన్‌స్టన్‌ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి అది మళ్లీ బరోడా మహరాజు వద్దకు చేరింది. ఆ తర్వాత ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ఇన్నాళ్లకు వేలానికి వస్తోంది. ఇది వేలంలో ఎంత ధర పలికినా, దాని చరిత్ర విలువకు సమానంగా ఉండదు.

Read also: Narendra Modi: అభిమానికి షూ తొడిగిన ప్రధాని

#BlueDiamond #ChristiesAuction #DiamondAuction #ExpensiveJewels #GolcondaBlueDiamond #JewelryAuction Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.