గోవాలోని ఉత్తర గోవా అర్పోరా ప్రాంతంలో జరిగిన నైట్క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు, మరి 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిర్స్ నైట్క్లబ్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మృతులలో క్లబ్ సిబ్బంది 16 మంది, మహిళలు 3 మంది, పర్యాటకులు 4 మంది ఉన్నారు. కొందరు మంటల్లో చిక్కుకొని, మరికొందరు పొగ కారణంగా ఊపిరాడలేక మరణించారు.
Read also: Arunachalam Tour: సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

President Murmu, Prime Minister Modi respond
గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపదీ (Droupadi Murmu) ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: