News Telugu: Goa: గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

Read Time:  1 min
Vande Mataram 150 years
Vande Mataram 150 years
FONT SIZE
GET APP

గోవాలోని ఉత్తర గోవా అర్పోరా ప్రాంతంలో జరిగిన నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు, మరి 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బిర్స్ నైట్‌క్లబ్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మృతులలో క్లబ్ సిబ్బంది 16 మంది, మహిళలు 3 మంది, పర్యాటకులు 4 మంది ఉన్నారు. కొందరు మంటల్లో చిక్కుకొని, మరికొందరు పొగ కారణంగా ఊపిరాడలేక మరణించారు.

Read also: Arunachalam Tour: సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

President Murmu, Prime Minister Modi respond

President Murmu, Prime Minister Modi respond

గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపదీ (Droupadi Murmu) ముర్ము కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.