Gautam Gambhir: పర్సనాలిటీ రైట్స్ కోసం గంభీర్ పోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Read Time:  1 min
Gautam Gambhir: పర్సనాలిటీ రైట్స్ కోసం  గంభీర్ పోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
FONT SIZE
GET APP

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందనడానికి గౌతమ్ గంభీర్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ఒక నిదర్శనం. జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం ఈ కేసు ను విచారించింది.పిటిషన్‌లోని కొన్ని లోపాలను సరిచేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల‌ 23కు వాయిదా వేసింది.

Read Also: IPL 2026: సంజూ CSK ఎంట్రీపై వరల్డ్ కప్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు

పిటిషన్‌లో గంభీర్ పేర్కొన్న ప్రధానాంశాలు:

గంభీర్ తన పిటిషన్‌లో 16 సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. వీరిలో మెటా, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ (యూట్యూబ్) వంటి సోషల్ మీడియా దిగ్గజాలతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు కూడా ఉన్నాయి. కేంద్ర ఐటీ, టెలికాం శాఖలను కూడా ప్రతివాదుల జాబితాలో చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ సహాయంతో ఫేస్-స్వాపింగ్, వాయిస్-క్లోనింగ్ చేసి, తనపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గంభీర్ ఆరోపించారు.

Gambhir's fight for personality rights.. Petition in Delhi High Court
Gambhir’s fight for personality rights.. Petition in Delhi High Court

ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి వేదికలపై ఇలాంటి నకిలీ కంటెంట్ గణనీయంగా పెరిగిపోయిందని గంభీర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లుగా సృష్టించిన ఒక డీప్‌ఫేక్ వీడియోకు 29 లక్షలకు పైగా వ్యూస్ రాగా, ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్ల గురించి తాను వ్యాఖ్యానించినట్లు ఉన్న మరో నకిలీ వీడియోకు 17 లక్షల వ్యూస్ వచ్చాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ తరహా కంటెంట్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న తన వృత్తికి, ప్రతిష్ఠ‌కు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ-కామర్స్ సైట్లలో తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలతో పోస్టర్లు, ఇతర వస్తువులు అమ్ముతున్నారని కూడా గంభీర్ ఆరోపించారు. తన గుర్తింపును ఆయుధంగా వాడుకుని కొందరు అజ్ఞాత వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.కాపీరైట్, ట్రేడ్‌మార్క్ చట్టాల కింద దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో తన పేరు, ఫొటో, వాయిస్‌ను ఎలాంటి మాధ్యమంలోనైనా తన అనుమతి లేకుండా వాడకుండా శాశ్వత ఇంజంక్షన్ విధించాలని గంభీర్ కోరారు. పరువు నష్టానికి పరిహారంగా రూ. 2.5 కోట్లు ఇప్పించాలని, అక్రమంగా సంపాదించిన లాభాల లెక్కలు సమర్పించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ కంటెంట్‌ను తొలగించాలని కూడా అభ్యర్థించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.