Egg safety: కోడిగుడ్లలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయనే ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) స్పష్టమైన వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న కోడిగుడ్లు మానవ వినియోగానికి పూర్తిగా భద్రమైనవేనని సంస్థ స్పష్టం చేసింది. గుడ్ల నాణ్యతపై వస్తున్న ఆరోపణలు శాస్త్రీయ ఆధారాలు లేనివని, ప్రజల్లో అనవసర భయాన్ని కలిగించేలా ఉన్నాయని పేర్కొంది.
Read also: Anand Varadarajan: స్టార్బక్స్ CTOగా ఆనంద్ వరదరాజన్
నైట్రోఫ్యూరాన్ ఆరోపణలపై FSSAI క్లారిటీ
ఇటీవలి కాలంలో కొన్ని మీడియా కథనాలు, సోషల్ మీడియా వేదికలపై కోడిగుడ్లలో నైట్రోఫ్యూరాన్ జీవక్రియా అవశేషాలు (AOZ) ఉన్నాయనే వాదనలు వినిపించాయి. దీనిపై స్పందించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ, 2011 ఆహార భద్రతా నిబంధనల ప్రకారం కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్ల వినియోగం పూర్తిగా నిషేధించబడిందని గుర్తు చేసింది.

పర్యవేక్షణ, పరీక్షల కోసమే నైట్రోఫ్యూరాన్(Nitrofuran)కు కిలోకు 1 మైక్రోగ్రామ్ పరిమితిని (EMRL) నిర్ణయించామని, ఇది ప్రయోగశాలల్లో గుర్తించగల అతి తక్కువ స్థాయి మాత్రమేనని అధికారులు తెలిపారు. ఈ పరిమితికి లోపల స్వల్ప ఆనవాళ్లు కనిపించినా అవి ఆరోగ్యానికి హానికరం కాదని, నిబంధనల ఉల్లంఘనగా కూడా పరిగణించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో భారత ప్రమాణాలు అమెరికా, యూరోపియన్ యూనియన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని వెల్లడించారు.
కోడిగుడ్ల వినియోగం వల్ల క్యాన్సర్
సాధారణంగా కోడిగుడ్ల వినియోగం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ మరోసారి తేల్చిచెప్పింది. ఒకవేళ ఏదైనా ప్రత్యేక బ్రాండ్ లేదా బ్యాచ్లో సమస్య గుర్తించినా, దాన్ని మొత్తం దేశంలోని గుడ్లకు వర్తింపజేయడం సరైంది కాదని హితవు పలికింది. వినియోగదారులు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచిస్తూ, కోడిగుడ్లు పోషకాలు అధికంగా ఉన్న సురక్షిత ఆహారమని సంస్థ పునరుద్ఘాటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: