ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) యుద్ధ వాతావరణం మధ్య ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో భారత్ మరొక విజయాన్ని నమోదు చేసింది. శనివారం ట్రెహ్రాన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక విమానం, 310 మంది భారతీయులతో న్యూఢిల్లీకి (To New Delhi with Indians) సురక్షితంగా చేరింది. వీరంతా విద్యార్థులే కావడం గమనార్హం.విమానం దిగిన వెంటనే కుటుంబ సభ్యులు, అధికారులు విద్యార్థులను హర్షాతిరేకాలతో స్వాగతించారు. వాస్తవానికి ఈ యాత్ర కేవలం విమాన ప్రయాణం మాత్రమే కాదు – ఇది గుండె నిండే మధురమైన తిరిగొచ్చే క్షణం. ప్రతి ఒక్కరూ దేశానికి చేరినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
భారత ప్రభుత్వానికి విద్యార్థుల కృతజ్ఞతల వెల్లువ
ఇరాన్ నుంచి వెళ్లే సమయంలో వసతి, భోజన సదుపాయాలన్నీ సమయానికి ఇచ్చారు. తిరిగి ఇండియాకు రావడం చాలా సంతోషంగా ఉంది, అని అల్మాస్ రిజ్వి అనే విద్యార్థి చెప్పారు. ఇండియన్ ఎంబసీ ఎంతో తోడ్పాటిచేసింది. ప్రభుత్వ శ్రద్ధ స్ఫూర్తిదాయకం, అని విద్యార్థులు ముచ్చటించారు.ఇప్పటివరకు 827 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ వెల్లడించారు. ఆపరేషన్ సింధు ఇంకా కొనసాగుతోంది. జూన్ 20న 290 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరగా, జూన్ 19న 110 మంది విద్యార్థులు అర్మేనియా, దోహా మీదుగా వచ్చారు.
ఇరాన్ ప్రభుత్వ సహకారంతో వేగవంతమైన తరలింపు
భారత ప్రభుత్వం తీసుకున్న చొరవకు ఇరాన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది. గగనతలాన్ని ప్రత్యేకంగా తెరిచింది. ఈ చర్య వల్ల 1,000 మందికి పైగా భారతీయులను భారతదేశానికి తరలించేందుకు వీలైంది.ఈ యాత్రలన్నీ ఒకటే సందేశాన్ని చెబుతున్నాయి – భారత ప్రభుత్వం ఎక్కడ ఉన్నా భారతీయుల ప్రాణాలకు విలువిస్తుంది. ఆపరేషన్ సింధు సైనిక చర్య కాదు… కానీ ప్రతి భారతీయుడి గుండెను తాకిన ఓ సంరక్షణ యాత్ర.
Read Also : Sonia Gandhi : కేంద్రాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ